మంచి కట్టు, బొట్టు, అందం కలిగి ఉన్న యువతిని పెళ్లి చేసుకోవాలని ప్రతీ యువకుడికి కోరిక ఉంటుంది.

మంచి కట్టు, బొట్టు, అందం కలిగి ఉన్న యువతిని పెళ్లి చేసుకోవాలని ప్రతీ యువకుడికి కోరిక ఉంటుంది. ఈ తరహాలోనే ఓ వ్యక్తికి అందమైన యువతి భార్యగా వచ్చిందని ఎంతో సంతోషపడ్డాడు. కానీ ఆమెనె అతడిపాలిట యమదూత అవుతుందని ఊహించుకోలేకపోయాడు. అందమైన భార్య వచ్చిందని సంతోషపడుతూ చక్కగా సంసారం చేసుకుంటున్నారు. కానీ భార్య తప్పుడు దారి పట్టింది. ప్రియుడి మోజులో పడి భర్తను చంపించింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్రం హత్రాస్‌(Hathras) జిల్లా కొత్వాలిలో మునేంద్ర ఉపాధ్యాయతో(Teacher) ప్రియాంకకు వివాహం జరిగింది. కొంత కాలం ఈ ఇద్దరి సంసారం సాఫీగానే సాగింది. మునేంద్ర స్థానికంగానే పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ఉదయాన మునేంద్ర వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి చంపారు. మృతుడి సోదురడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు విచారించగా పోలీసులకు ఓ సంచలన విషయం తెలిసింది. మునేంద్ర ఉపాధ్యాయను హత్య చేయించడంలో అతడి భార్య ప్రియాంకదే కీలక పాత్ర అని పోలీసుల విచారణలో తెలింది. ప్రియుడి(Lover) మోజులో పడి భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. భర్త స్నేహితులకు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులతో సహా ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంకకు భాను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఏడాదిన్నర క్రితం అతడితో కలిసి పారిపోయానని పోలీసులు విచారణలో తెలిపింది. తమకు మధ్య అడ్డుగా ఉన్న మునేంద్రను చంపేందుకు ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది. అందమైన భార్య దొరికిందని పద్దతిగా చూసుకుంటున్న భర్తను చంపేందుకు మనసు ఎలా వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story