కర్ణాటకలో(Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్‌లో కాంగ్రెస్‌కు(congress) పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలతో పాటు విపక్షాలు బీజేపీని టార్గెట్ చేయ‌డం ప్రారంభించాయి.

కర్ణాటకలో(Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్‌లో కాంగ్రెస్‌కు(congress) పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలతో పాటు విపక్షాలు బీజేపీని టార్గెట్ చేయ‌డం ప్రారంభించాయి. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi) బీజేపీపై మండిపడ్డారు.

ఈ మేర‌కు ప్రియాంక.. కర్ణాటక ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ ప్రకారం.. బజరంగ్‌ బలీ కీ జై, బీజేపీ ఓటమి ఖాయమంటూ ట్వీట్‌ చేశారు.

మ‌రో ట్వీట్‌లో.. కర్ణాటకలో ప్రధాని మోదీ ప్రచారాన్ని బజరంగ్ బలి కూడా తిరస్కరించారు. మీడియా కేవ‌లం జేపీ న‌డ్డా, బ‌స్వ‌రాజ్ బొమ్మై ల‌నే ఓట‌మికి కార‌కులుగా చూపిస్తుంది. ఇది ప్రధాని మోదీ ఓటమి. ఆయన కూడా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌ ప్రచార బాధ్యతలు నిర్వర్తించారని రాసుకొచ్చారు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఉన్న‌ ట్రెండ్స్ ప్ర‌కారం కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వచ్చిందని మీకు తెలియజేద్దాం. ఈ వార్త రాసే సమయానికి కాంగ్రెస్ 130 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ(BJP) 66 స్థానాల్లో ముందంజ‌ ఉండగా.. జేడీఎస్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Updated On 13 May 2023 2:53 AM GMT
Ehatv

Ehatv

Next Story