ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఇద్దరు ప్రత్యేక అతిథులు బుధవారం పీఎంవోకు వెళ్లారు.

ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఇద్దరు ప్రత్యేక అతిథులు బుధవారం పీఎంవోకు వెళ్లారు. ప్రత్యేక అతిథులు అంటే ఎవ‌రో దేశ అధ్య‌క్షుడు కాదు ఇద్దరు చిన్నారులు. వారిని చూసి ప్రధాని మోదీ చాలా సంతోషించారు.

ప్ర‌ధాని చిన్నారులిద్దరితో కొద్ది సేపు ఆనందంగా గడిపారు. ఇద్దరు బాలికలు ప్రధాని మోదీకి కవితలు చెప్పారు. అది విని ఆయ‌న‌ చాలా సంతోషంగా కనిపించారు. ప్రధాని మోదీ వారిని ఆప్యాయంగా ద‌గ్గ‌రికి తీసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేశారు.

ఇద్దరు బాలిక‌లు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాళ్లు. ప్ర‌ధాని మోదీని కలవడానికి దత్తాత్రేయ పీఎంఓకు వెళ్లారు. ఆయ‌న వెంట త‌న మ‌న‌మ‌రాళ్ల‌ను కూడా తీసుకెళ్ల‌గా.. ప్రధాని మోదీని ప్రశంసిస్తూ వారు రాసిన‌ ఓ కవితను చ‌దివారు. దీంతో ప్రధాని మోదీ ప‌ర‌వ‌శించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story