దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు జైత్‌పూర్‌(Jaitpur) ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ముసుగులు ధరించిన ఆగంతులిద్దరూ చొరపడ్డారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న 24 ఏళ్ల పూజా యాదవ్‌పై(Pooja Yadav) కాల్పులు జరిపారు. కాల్పుల చప్పుడు విన్న ఇరుగుపొరుగు వారు వెంటన తమ ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు.

దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు జైత్‌పూర్‌(Jaitpur) ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ముసుగులు ధరించిన ఆగంతులిద్దరూ చొరపడ్డారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న 24 ఏళ్ల పూజా యాదవ్‌పై(Pooja Yadav) కాల్పులు(F) జరిపారు. కాల్పుల చప్పుడు విన్న ఇరుగుపొరుగు వారు వెంటన తమ ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. బైక్‌ మీద పారిపోతున్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగంతకులిద్దరూ బైక్‌ను వదిలేసి పరుగులు పెట్టారు. కాల్పులలో గాయపడిన పూజా యాదవ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. హంతకులకు చెందిన నంబర్‌ప్లేట్‌ లేని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated On 28 Oct 2023 4:24 AM GMT
Ehatv

Ehatv

Next Story