ప్రముఖ గాయకుడు మనో కొడుకుల కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన కుమారులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రముఖ గాయకుడు మనో కొడుకుల కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన కుమారులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు కారణం వీరిద్దరు మద్యం మత్తులో ఇద్దరిపై దాడి చేసి పరారవ్వడమే. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన 20 ఏళ్ల కృపాకరన్( krupakaran) ఫుట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానికంగా ఉన్న హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో మనో కుమారులు రఫీ(Rafi), షకీర్‌(Shakir)లతోపాటు వారి స్నేహితులు మొత్తం అయిదుగురు అక్కడ ఉన్నారు. అప్పటికే వీరు ఫుల్లుగా తాగారు. ఆ మత్తులో కృపాకరన్‌తో గొడవ పడ్డారు. అతడిపై దాడికి దిగారు. ఈ ఘటనలో కృపాకరన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కృపాకరన్‌ ఫిర్యాదు మేరకు వళసరవాక్కం పోలీసులు సింగర్‌ మనో(singer Mano)కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్(Vignesh), ధర్మ(Dharma),జహీర్‌(Jahir) పై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హత్య బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు బేస్ బాల్ బ్యాట్‌లు, కర్రలు పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్నట్లు ఉంది. రోడ్డు పక్కన ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గొడవ పడుతున్న వారిలో మనో కుమారులు కూడా ఉన్నారు.

ehatv

ehatv

Next Story