ఈజీగా డబ్బు(Money) సంపాదించాలనీ, త్వరగా శ్రీమంతురాలిని కావాలని ఆశపడిందా అమ్మాయి. అందుకు అడ్డదారులు వెతుక్కుంది. ఏకంగా నలుగురిని పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసింది. కర్ణాటకలోని(Karnataka) మండ్య(Mandya) జిల్లా పాండవపురకు చెందిన పాతికేళ్ల స్నేహకు(Sneha) రెండేళ్ల కిందట రైలులో వెళుతున్నప్పుడు ప్రశాంత్‌(Prashanth) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.

ఈజీగా డబ్బు(Money) సంపాదించాలనీ, త్వరగా శ్రీమంతురాలిని కావాలని ఆశపడిందా అమ్మాయి. అందుకు అడ్డదారులు వెతుక్కుంది. ఏకంగా నలుగురిని పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసింది. కర్ణాటకలోని(Karnataka) మండ్య(Mandya) జిల్లా పాండవపురకు(Pandavapura) చెందిన పాతికేళ్ల స్నేహకు(Sneha) రెండేళ్ల కిందట రైలులో వెళుతున్నప్పుడు ప్రశాంత్‌(Prashanth) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని దావణగెరెలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తాను గర్భిణి(Pregnant) అయ్యానని ప్రశాంత్‌కు చెప్పి రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్లింది. ఎంతకూ రాకపోయే సరికి ఫోన్‌ చేసి రమ్మని పిలిచాడు ప్రశాంత్‌. అందుకు ససేమిరా అనేసింది. ఆమె ఇచ్చిన అడ్రస్‌ను వెతుక్కుంటూ పుట్టింటికి వెళ్లాడు ప్రశాంత్‌. ఆమె అక్కడ లేదు. తన భార్య కనిపించడం లేదంటూ కేటీజే నగర పోలీస్‌ స్టేషన్‌లో(KTJ Nagar Police Station) కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసుల దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు తెలిశాయి. స్నేహకు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ప్రశాంత్‌ మూడో భర్త అని పోలీసులు గుర్తించారు. ఆమె ఆచూకి తెలుసుకుని వెళితే పోలీసులకు మరో షాక్‌ తగిలింది. బెంగుళూరుకు చెందిన రఘు(Raghu) అనే యువకుడిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టిందా నిత్యపెళ్లి కూతురు. స్నేహకు మొదట మేలుకోటెలో ఉంటున్న మహేశ్‌ అనే అతడితో పెళ్లి చేశారు కుటుంబసభ్యులు. అతడిని విడిచిపెట్టి బెంగళూరుకు చెందిన వెంకటేశ్‌ను రెండో వివాహం చేసుకుంది. తర్వాత అతడిని కూడా విడిచిపెట్టి దావణగెరెకు చెందిన ప్రశాంత్‌ను మనువాడింది. ఇప్పుడు రఘుతో మూడుముళ్లు వేయించుకుంది. ప్రశాంత్‌ ఇచ్చిన కంప్లయింట్‌ ఆధారంగా స్నేహను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Updated On 30 Dec 2023 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story