ఫక్తు ముస్లిం(Muslim) దేశమైన అబుదాబిలో(Abudabi) హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ(PM narendra Modi) స్వయంగా ప్రారంభించారు. ముస్లిం దేశంగా పేరుగాంచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హిందూ దేవాలయాన్ని నిర్మించడం, ఈరోజే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభించడం హిందువులకు గొప్ప గర్వ కారణంగా ఉంది. ఈ దేవాలయ విశేషాలేంటో తెలుసుకుందాం.

ఫక్తు ముస్లిం(Muslim) దేశమైన అబుదాబిలో(Abudabi) హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ(PM narendra Modi) స్వయంగా ప్రారంభించారు. ముస్లిం దేశంగా పేరుగాంచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హిందూ దేవాలయాన్ని నిర్మించడం, ఈరోజే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభించడం హిందువులకు గొప్ప గర్వ కారణంగా ఉంది. ఈ దేవాలయ విశేషాలేంటో తెలుసుకుందాం.

దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో హిందూ ధర్మం ఉట్టిపడేలా నిర్మించిన ఈ దేవాలయాన్ని ‘బాప్స్ స్వామినారాయణ్’(Baps Swaminarayan) సంస్థ నిర్మించింది. 55 వేల చ.మీ.పరిధిలో హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పశ్చిమ ఆసియాలోనే అతిపెద్దదిగా నిలించింది. అరబ్ ఏమిరేట్స్ 7 దేశాల సమాహారమన్న విషయం తెలిసిందే. దీంతో 7 గోపురాలతో ఎమిరేట్స్‌ ప్రతీకగా నిర్మించారు. 108 అడుగుల ఎత్తు.. 262 అడుగుల పొడవు.. 180 అడుగుల వెడల్పుతో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి ఎగుమతి చేసిన పాలరాయిని వినియోగించారు. లోపల మాత్రం ఇటాలియన్ మార్బుల్‌ను వినియోగించారు. వందలాది మంది శిల్పులు, కార్మికులు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. ఇందులో 402 పాలరాతి స్తంభాల్ని అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు.. ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, నెమళ్లు, సంగీత పరికరాల్ని వాయిస్తున్న విద్వాంసులను చెక్కారు. హైందవ ధర్మం ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం జరిగింది.

ఈ ఆలయ నిర్మాణం కోసం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేశారు. రాజస్థాన్(Rajasthan).. గుజరాత్‌కు చెందిన 2 వేల మందికి పైగా పని చేశారు. ఆలయ నిర్మాణంలో అయోధ్య రామాలయం(Ayodhya temple) మాదిరి స్టీల్, కాంక్రీట్‌, సిమెంట్ వాడలేదు. ఆలయం మొత్తాన్ని 25వేలకుపైగా విడి భాగాలు భారత్‌లో నిపుణుతో చేయించి యూఏఈకి తరలించారు. అంతేకాకుండా 5వేల మందికి సరిపోయే 2 కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేశారు. భక్తులు బస చేసేందుకు ఆలయం సమీపంలో మరో భవనాన్ని కూడా నిర్మించారు. దీన్ని అరేబియన్.. ఇస్లామిక్ వాస్తు రీతుల్లో నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం, జగన్నాథుడు, స్వామి నారాయణుడు, శ్రీ వేంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి కథలను చెక్కారు.

ఆలయ కింద భాగంలో గంగా, యమునా నదీ ప్రవాహాన్ని తలపించేలా ఆర్టిఫీషియల్‌ నదిని ఏర్పాటు చేసి ప్రత్యేక ఫోకస్ లైట్లను అమర్చారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలు, సందర్శకుల కేంద్రాలు, ఎగ్జిబిషన్లు, పిల్లలు ఆడుకునే ప్రాంతాలు, ఉద్యానవనాలు.. ఫుడ్ కోర్టులు, పుస్తకాల దుకాణాలు ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులను తెలిసేలా భారీ సెన్సార్లను ఏర్పాటు చేశారు. 2015లో ప్రధాని హోదాలో మోడీ పర్యటనలో యూఏఈ యువరాజుగా షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కీలక చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుతగా 13.5 ఎకరాల భూమిని కేటాయించగా ఆ తర్వాత 2019లో ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో 27 ఎకరాల్లో ఆలయ నిర్మాణం జరిగింది. యూఏఈ దేశాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆలయానికి పర్యాటకులు కూడా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated On 14 Feb 2024 5:48 AM GMT
Ehatv

Ehatv

Next Story