ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) మళ్లీ ముస్లిం(Muslim) పాట ఎత్తుకున్నారు. మొన్నటికి మొన్న తాను ఎప్పుడూ ముస్లింల గురించి మాట్లాడలేదని, ఎక్కువ పిల్లలు ఉన్నవారు అని అన్నానే తప్ప ముస్లిం పేరు ఎత్తలేదని చెప్పిన మోదీ నిన్న మళ్లీ ముస్లిం, హిందూ అంటూ ప్రసంగించారు.

ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) మళ్లీ ముస్లిం(Muslim) పాట ఎత్తుకున్నారు. మొన్నటికి మొన్న తాను ఎప్పుడూ ముస్లింల గురించి మాట్లాడలేదని, ఎక్కువ పిల్లలు ఉన్నవారు అని అన్నానే తప్ప ముస్లిం పేరు ఎత్తలేదని చెప్పిన మోదీ నిన్న మళ్లీ ముస్లిం, హిందూ అంటూ ప్రసంగించారు. మతం(Religion) ప్రాతిపదికన ప్రజలను విభజించే కాంగ్రెస్‌(congress), ఇండియా కూటమి పథకాలను తాను అందరికీ చెబుతున్నానని మోదీ అన్నారు. మహారాష్ట్రలోని థానే() జిల్లాలోని కల్యాణ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ తనకు తన ఇమేజ్‌ కంటే దేశ సమైక్యత ముఖ్యమని తెలిపారు. ముస్లింలకు 15 శాతం నిధులు కేటాయించడం ద్వారా దేశ బడ్జెట్‌ను ముస్లిం బడ్జెట్‌, హిందూ బడ్జెట్‌గా విభజించాలని కాంగ్రెస్‌ అనుకుంటున్నదని మోదీ అన్నారు.

Updated On 16 May 2024 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story