జగిత్యాలలో(Jagityal) నిర్వహించిన బీజేపీ(BJP) విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) మాట్లాడారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ఆయ‌న‌.. లోక్‌సభ ఎన్నికల నగారా మోగిందన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందన్నారు. వికసత్‌ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని.. 400 దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలన్నారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అని నినదిస్తున్నారని పేర్కొన్నారు.

జగిత్యాలలో(Jagityal) నిర్వహించిన బీజేపీ(BJP) విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) మాట్లాడారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ఆయ‌న‌.. లోక్‌సభ ఎన్నికల నగారా మోగిందన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందన్నారు. వికసత్‌ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని.. 400 దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలన్నారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అని నినదిస్తున్నారని పేర్కొన్నారు. తనకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తోంది. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నామ‌ని గుర్తుచేశారు.శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోందన్నారు. నేను భారతమాతకు పూజారిని అని ప్ర‌ధాని తెలిపారు.

శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకంగా అని చెప్పారు. శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా..? శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నా.. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4 న తెలుస్తుందన్నారు. తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల. ఆంగ్లేయులు, రజాకార్లపై తెలంగాణ సమాజం విరోచిత పోరాటం చేసింది. బీఆర్ఎస్(BRS) తెలంగాణ ప్రజలను దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌(congress) రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుంది. తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోంది. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్‌ మౌనం వహిస్తోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుందన్నారు. తెలంగాణ కలలను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నాశనం చేశాయన్నారు. ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ చెలగాటం ఆడిందన్నారు.

అధికారంలోకి రాకముందు అనేక మాటలు మాట్లాడిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం సహా దేనిపైనా విచారణ చేయడం లేదన్నారు. రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించామ‌ని తెలిపారు. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. పసుపు ధరను క్వింటాల్ కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు పెంచామ‌ని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయని.. మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్లు తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేస్తామ‌న్నారు.

తెలంగాణలో రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తామ‌న్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయన్నారు. మాకు అధికారం కాపుడుకోవడం కన్నా.. ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యమ‌న్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే.. ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే.. మోదీని తిట్టడం ప్రారంభిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహం బయటపడిందన్నారు. తెలంగాణను దోచుకున్న వారిని తాము విడిచిపెట్టేది లేదు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకు రాజకీయాలు చేస్తున్నాయి. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2 జి స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. అది కుటుంబ పార్టీ. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు బయటకు వచ్చింది. అది కుటుంబ పార్టీ. ఇప్పుడు ఆ జాబితాలో కుటుంబ పార్టీ బిఆర్‌ఎస్ చేరింది. కుటుంబ పార్టీ అయిన బీఆర్‌ఎస్ కాళేశ్వరంలో అవినీతి చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలోనూ బీఆర్‌ఎస్ కు చెందిన నాయకులు అవినీతికి పాల్పడ్డారు. కేవలం ఆ రెండు పార్టీలు బీజేపీని, మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు ఎంత కవర్ ఫైర్ చేసినా.. తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టబోం. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయం చేస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన బీఆర్ఎస్.. లిక్కర్ స్కామ్‌లోనూ కమీషన్లు తీసుకుంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు వారి అవినీతి కొనసాగిందన్నారు. బీజేపీకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. జూన్ 4న ఎన్డీయేకు 400 సీట్లు దాటాలని పిలుపునిచ్చారు.

Updated On 18 March 2024 5:00 AM GMT
Ehatv

Ehatv

Next Story