దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు

దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 8వ తారీఖున ఢిల్లీలోని క‌ర్త‌వ్య‌ప‌థ్‌లో ప్ర‌మాణ‌స్వీకార మ‌హోత్స‌వం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఎన్‌డీఏ కూట‌మి నేత‌లు హాజ‌రుకానున్నారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా, మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి ఎన్‌డీఏ 293 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి పక్షాల మద్దతుతో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఢిల్లీలో ఎన్‌డీఏ మిత్ర‌పక్షాల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఎన్‌డీఏ పక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇక ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి.

Updated On 5 Jun 2024 3:23 AM GMT
Yagnik

Yagnik

Next Story