మణిపూర్ హింసాత్మక ఘటనలపై ప్రజల్లో ఆగ్రహం కొనసాగుతోంది. ఇదే అంశంపై గురువారం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అయితే.. ధర్మాసనం ఇప్పటికే ఈ అంశాన్ని కోర్టులో పరిశీలిస్తున్నందున మరో పిటీషన్‌ వేయాల్సిన అవసరం ఏముందని పిటీషనర్‌ను ప్రశ్నించింది.

మణిపూర్ హింసాత్మక(Manipur Violence) ఘటనలపై ప్రజల్లో ఆగ్రహం కొనసాగుతోంది. ఇదే అంశంపై గురువారం సుప్రీంకోర్టు(Supreme Court)లో మరో పిటిషన్ దాఖలైంది. అయితే.. ధర్మాసనం ఇప్పటికే ఈ అంశాన్ని కోర్టులో పరిశీలిస్తున్నందున మరో పిటీషన్‌ వేయాల్సిన అవసరం ఏముందని పిటీషనర్‌ను ప్రశ్నించింది. అలాగే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(Dhananjaya Yeshwant Chandrachud) ముందు తన పిటిషన్‌ను ప్రస్తావించాలని కోరారు. మణిపూర్‌లో లైంగిక వేధింపులు, హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.

జస్టిస్ ఎస్కే కౌల్(Justice SK Kaul), జస్టిస్ సుధాన్షు ధులియా(Justice Sudhanshu Dhulia)లతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశాన్ని లిస్టింగ్ కోసం ప్రస్తావించారు. సీజేఐ చంద్రచూడ్ గురువారం కోర్టుకు రాలేదు. మణిపూర్ హింసాకాండకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తుతూ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను శుక్రవారం విచారణకు జాబితా చేస్తున్నట్లు... పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది విశాల్ తివారీ(Vishal Tiwari) ధర్మాసనానికి తెలిపారు. సంబంధిత అంశంతో పాటు తన పిటిషన్‌ను కూడా శుక్రవారం విచారణకు జాబితా చేయాలని ఆయన అభ్యర్థించారు.

దీనిపై ధర్మాసనం ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుపుతోందని, కాబట్టి మరో పిటిషన్‌ వేయాల్సిన అవసరం ఏముందని పేర్కొంది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నారని ఆయన అన్నారు. రేపు సీజేఐ(CJI) ఎదుట ప్రస్తావించాలని ధర్మాసనం పేర్కొంది.

మణిపూర్‌లో చట్టబద్ధత ఉల్లంఘన, క్రూరత్వం, అన్యాయానికి వ్యతిరేకంగా తాను పిటిషన్‌ దాఖలు చేసినట్లు తివారీ పేర్కొన్నారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి అవమానకర రీతిలో ఊరేగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా దాని వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసింది. మణిపూర్‌లో రెండు నెలల క్రితం హింస, దాడి, లైంగిక వేధింపులు, అత్యాచారం, అల్లర్లకు సంబంధించిన సంఘటన జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్వతంత్ర నిపుణుల కమిటీ తమ‌ నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని కోరాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, లలిత కుమారి(Lalitha Kumari) కేసులో అత్యున్నత న్యాయస్థానం 2013లో ఇచ్చిన తీర్పును పాటించని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర సంస్థలపై చర్యలకు ఆదేశాలు జారీ చేయాలి. మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై సీబీఐ(CBI) విచారణకు ఆదేశించాలని కూడా తివారీ కోర్టును కోరారు.

Updated On 27 July 2023 4:33 AM GMT
Yagnik

Yagnik

Next Story