కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. లీటర్ పెట్రోల్ పై రూ.2, డీజిల్ పై రూ.2 తగ్గిస్తున్నట్టు కేంద్ర చమురు శాఖ వెల్లడించింది.
ధరల తగ్గింపుపై చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే సమాచారం అందిచాయని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది. పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీజిల్‌తో నడిచే 58 లక్షలకు పైగా భారీ వాహనాలు, 6 కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించారు.

పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశంసించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఇంధన ధరలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. భారతదేశంలో ఇంధన ధరల కంటే ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌లలో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

పెట్రోల్ ధరలు:
ఢిల్లీలో ధర రూ.96.72 నుంచి రూ.94.72కి తగ్గింది
ముంబైలో ఈ ధరలు రూ.106.31 నుంచి రూ.104.21కి చేరింది
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.3 నుంచి 103.94కి తగ్గింది
చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63 నుంచి 100.75కి తగ్గింది

డీజిల్ ధరలు:
ఢిల్లీలో డీజిల్ ధర రూ.89.62 నుంచి రూ.87.62కి చేరింది.
ముంబైలో డీజిల్ ధర రూ.94.27 నుంచి రూ.92.15కి తగ్గింది.
కోల్‌కతాలో డీజిల్ ధర రూ.92.76 నుంచి 90.76కి చేరింది
చెన్నైలో డీజిల్ ధర రూ.94.24 నుంచి 92.34కి తగ్గింది

Updated On 14 March 2024 8:23 PM GMT
Yagnik

Yagnik

Next Story