వివాదాస్పద ఈసీ బిల్లును అనుకున్నట్టుగానే లోక్‌సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబందించిన బిల్లును గురువారం పార్లమెంట్‌ ఆమోదించినట్టు అయ్యింది. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించింది. ఇక మిగిలిందల్లా రాష్ట్రపతి ఆమోదమే! ఆమె కూడా ఆమోదిస్తే బిల్లు చట్టంగా రూపొందుతుంది.Election Commissioners

వివాదాస్పద ఈసీ బిల్లును అనుకున్నట్టుగానే లోక్‌సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబందించిన బిల్లును గురువారం పార్లమెంట్‌ ఆమోదించినట్టు అయ్యింది. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించింది. ఇక మిగిలిందల్లా రాష్ట్రపతి ఆమోదమే! ఆమె కూడా ఆమోదిస్తే బిల్లు చట్టంగా రూపొందుతుంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధి విధానాలను ఏర్పాటు చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్‌ ఎన్నికల కమిషన్‌ను ఎన్నుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఈ బిల్లును రూపొందించారు. ఎన్నికల సంఘాన్ని నియమించాల్సిన విధి విధానాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఓ తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వం లోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. పార్లమెంట్ కొత్త బిల్లును ఆమోదించే వరకు ఈ విధి విధానాలను అనుసరించాలని స్పష్టం చేసింది..

Updated On 21 Dec 2023 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story