సరిగ్గా నెల రోజుల కిందట అయోధ్య(Ayodhya  Ram mandir) రామమందిరం ప్రారంభమయ్యింది. జనవరి 22వ తేదీన జరిగిన ఆ వేడుకలో బాలరాముడు గర్భగుడిలో కొలువు తీరాడు. ఆ రోజు నుంచే భక్తుల తాకిడి మొదలయ్యింది.

సరిగ్గా నెల రోజుల కిందట అయోధ్య(Ayodhya Ram mandir) రామమందిరం ప్రారంభమయ్యింది. జనవరి 22వ తేదీన జరిగిన ఆ వేడుకలో బాలరాముడు గర్భగుడిలో కొలువు తీరాడు. ఆ రోజు నుంచే భక్తుల తాకిడి మొదలయ్యింది. సుదీర్ఘకాలపు కల నెరవేరడంతో రామభక్తులు ఆనందపరవశులవుతున్నారు. వ్యయప్రయాసలకోర్చి అయోధ్యకు తరలివెళుతున్నారు. రామాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నెల రోజుల్లో దాదాపు 60 లక్షల మంది రామ్‌లల్లాను(Ram lalla) దర్శించుకున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు.

Updated On 22 Feb 2024 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story