ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) కన్నతల్లి ఇటీవలే కాలం చేశారు. ఇప్పుడు మోదీకి మరో అమ్మ వచ్చారు. ఆ అమ్మ పేరు మంగీబాయి(Mangibai).. వందేళ్ల వయసు ఉంటుందామెకు! ఆమెకు 14 మంది సంతానం.. నరేంద్రమోదీ తన 15వ కొడుకుగా భావిస్తుస్తున్నారు మంగీబాయి. ఎందుకూ అంటే ప్రధానిగా ఆయన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, తనలాంటి వారి కోసం ఎన్నో పథకాలను(Schemes) తీసుకొచ్చారని చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) కన్నతల్లి ఇటీవలే కాలం చేశారు. ఇప్పుడు మోదీకి మరో అమ్మ వచ్చారు. ఆ అమ్మ పేరు మంగీబాయి(Mangibai).. వందేళ్ల వయసు ఉంటుందామెకు! ఆమెకు 14 మంది సంతానం.. నరేంద్రమోదీ తన 15వ కొడుకుగా భావిస్తుస్తున్నారు మంగీబాయి. ఎందుకూ అంటే ప్రధానిగా ఆయన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, తనలాంటి వారి కోసం ఎన్నో పథకాలను(Schemes) తీసుకొచ్చారని చెబుతున్నారు. అందుకే ఆయనను కొడుకుగా భావిస్తున్నానని, ఆయనకు మాత్రమే ఓటు వేస్తానని అంటున్నారు మంగీబాయి.

మధ్యప్రదేశ్‌లోని(madhya Pradesh) రాజ్‌గఢ్(Rajgarh) జిల్లా హరిపురా(Haripura) గ్రామానికి చెందిన మంగీబాయి తన్వర్‌ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో(social media) వైరల్‌ అవుతోంది. ప్రధాని మోదీ దేశానికి చాలా సేవ చేస్తున్నారని, తన కోసం కూడా ఎంతో చేశారని వీడియోలో(Video) చెప్పారు మంగీబాయి. తనలాంటి వృద్ధుల ఆకలిదప్పులు తీరుస్తున్నారని, నిలవ నీడను కల్పిస్తున్నారని చెప్పారు. మోదీ తనకు ఇల్లు ఇచ్చాడని, ఉచితంగా వైద్యం అందిస్తున్నాడని, వితంతు పించన్‌ కూడా ఇస్తున్నాడని పేర్కొన్నారు. ఆర్ధికంగా ఆదుకోవడమే కాకుండా తిండి కూడా పెడుతున్నారని చెప్పారు. మోదీ వల్లే తాను తీర్థయాత్రలకు వెళ్లగలిగానని, అందుకే ఆయనను తన కొడుకుగా భావిస్తున్నానని మంగీబాయి తెలిపారు. అవకాశం దొరికితే ప్రధానిని స్వయంగా కలవాలని అనుకుంటున్నానన్నారు. తన పేరున ఉన్న పాతిక ఎకరాల భూమిని ప్రధానికి రాసిస్తానని చెప్పడం విశేషం.

Updated On 27 Jun 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story