గ్రేటర్ నోయిడాలోని(Greater noida) గౌతంబుద్ధవర్సిటీ స్టాఫ్ క్వార్టర్స్‌లో(Gautam Buddha University Staff Quarters) ఉన్న ఓ వాటర్‌ ట్యాంక్‌లో(Water tank) మహిల మృతదేహాన్ని(Dead body) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్త, అత్త కలిసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం బయటపడినప్పటి నుంచి ఆమె భర్త కనిపించకుండా పోయారు.

గ్రేటర్ నోయిడాలోని(Greater noida) గౌతంబుద్ధవర్సిటీ స్టాఫ్ క్వార్టర్స్‌లో(Gautam Buddha University Staff Quarters) ఉన్న ఓ వాటర్‌ ట్యాంక్‌లో(Water tank) మహిల మృతదేహాన్ని(Dead body) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్త, అత్త కలిసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం బయటపడినప్పటి నుంచి ఆమె భర్త కనిపించకుండా పోయారు. మహిళ భర్త స్థానికంగా ఉన్న జిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని తెలిసింది. భార్య, తల్లితో కలిసి కొన్నేళ్లుగా స్టాఫ్‌ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. అయితే మహిళ, ఆమె భర్త మధ్య తరుచుగా గొడవలు జరిగేవని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రికూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తినట్లు సాక్షులు చెప్తున్నారు. ఆ సమయంలో మహిళ భర్త మద్యం తాగి ఉన్నాడని సమాచారం. దీంతో ఆగ్రహంతో భార్యను హత్య చేసి వాటర్‌ ట్యాంక్‌లో పడేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త, అత్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీససులు మాట్లాడుతూ.. హత్యపై ప్రాథమిక ఆధారాలు సేకరించాం. మహిళ భర్త, అత్త కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని చెప్తున్నారు పోలీసులు.

Updated On 7 May 2024 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story