లాస్టియర్‌ అమెరికా సీటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని జాహ్నవికందుల(Jahnavi Kandhula) చనిపోయారు. రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. ఆమె మరణంపై అక్కడి పోలీసు అధికారి ఒకరు వెటకారంగా మాట్లాడిన విషయం తెలిసిందే. అతడు చేసిన వ్యాఖ్యలపై అనేక విమర్శలు వచ్చాయి. ఇండియా కూడా తీవ్రంగా రియాక్టయ్యింది.

లాస్టియర్‌ అమెరికా సీటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని జాహ్నవికందుల( jaahnavi kandula) చనిపోయారు. రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. ఆమె మరణంపై అక్కడి పోలీసు అధికారి ఒకరు వెటకారంగా మాట్లాడిన విషయం తెలిసిందే. అతడు చేసిన వ్యాఖ్యలపై అనేక విమర్శలు వచ్చాయి. ఇండియా కూడా తీవ్రంగా రియాక్టయ్యింది. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అయితే జాహ్నవి మృతికి కారణమైన పోలీసు అధికారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదని తెలిసింది. వాషింగ్టన్(Washington) స్టేట్‌లోని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. జాహ్నవి మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని, అయితే ఆమె యాక్సిడెంట్‌ కేసులో సియాటెల్‌ పోలీసు అధికారి కెవిన్‌ డేవ్‌కు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని ఉన్నతాధికారులు అంటున్నారు. కెవిన్‌ డేవ్‌పై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు ఉండబోవని చెప్పారు. మరోవైపు ఈ ప్రకటనపై జాహ్నవి బంధుమిత్రులు, పలువురు భారతీయ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో(America) న్యాయం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసు అధికారి అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తేలినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరని నిలదీస్తున్నారు. అదే సమయంలో ఆమె మృతిపై వెకిలిగా మాట్లాడిన అధికారి విషయంలోనూ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని స్థానిక మీడియా చెబుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్‌ డేవ్‌ డ్యూటీలోనే ఉన్నారు. ఆ రూట్లో స్పీడ్ లిమిట్‌ 40 కిలోమీటర్లు మాత్రమే. కానీ కెవిన్‌ డేవ్‌ వంద కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చాడు. ఎమర్జెన్సీ హారన్‌ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి వేగంగా వస్తున్న కారును అంచనా వేయలేకపోయింది. కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి వంద మీటర్లకు పైగా దూరంలో పడిపోయారు అని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే కెవిన్‌ డేవ్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోకపోయినా డిపార్ట్‌మెంట్‌ తరఫున చర్యలు ఉంటాయని అధికారులు అంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్‌ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సీటెల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ గిల్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేనియల్‌ ఆర్డరర్‌ ఆమె మృతిపై చాలా చీప్‌గా మాట్లాడాడు. గిల్డ్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ డేనియల్‌ ఆర్డరర్‌ నవ్వులు చిందించాడు. అంతేనా... ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని, కేవలం చెక్‌ ఇస్తే సరిపోతుందని, చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని ఇలా చాలా వెటకారంగా మాట్లాడాడు. అంతేకాదు ఆ తర్వాత దర్యాప్తులోనూ కెవిన్‌కు అనుకూలంగా, తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు. డేనియల్‌ ఆర్డరర్‌ చేసిన వ్యాఖ్యల మీడియోపై అధికారులు ఇప్పటకే విచారణ జరుపుతున్నారు. తాను ఆ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని డేనియల్‌ ఆర్డరర్‌ గతంలోనే ఓ వివరణ ఇచ్చుకున్నాడు.

Updated On 22 Feb 2024 1:31 AM GMT
Ehatv

Ehatv

Next Story