రేమండ్‌ లిమిటెడ్‌(Raymond Ltd) ఛైర్మన్‌ గౌతమ్‌ సింఘానియా(Gautam Singhania) -నవాజ్‌ మోదీ(Nawaz Modi) దంపతులు విడిపోతున్న విషయం తెలిసిందే! అయితే విడాకులకు నవాజ్‌ మోదీ అంగీకరించడం లేదు. సింఘానియా నికర ఆస్తిలో(Allimony) 75 శాతం తనకు ఇస్తేనే విడిపోయేందుకు ఒప్పుకుంటానని నవాజ్‌ మోదీ తెలిపినట్టు సమాచారం. అంటే ఇంచుమించు 8,200 కోట్ల రూపాయలు. తనకు నిహారిక, నిసా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం డబ్బు అవసరం అవుతుందని ఆమె చెబుతున్నారు.

రేమండ్‌ లిమిటెడ్‌(Raymond Ltd) ఛైర్మన్‌ గౌతమ్‌ సింఘానియా(Gautam Singhania) -నవాజ్‌ మోదీ(Nawaz Modi) దంపతులు విడిపోతున్న విషయం తెలిసిందే! అయితే విడాకులకు నవాజ్‌ మోదీ అంగీకరించడం లేదు. సింఘానియా నికర ఆస్తిలో(Alimony) 75 శాతం తనకు ఇస్తేనే విడిపోయేందుకు ఒప్పుకుంటానని నవాజ్‌ మోదీ తెలిపినట్టు సమాచారం. అంటే ఇంచుమించు 8,200 కోట్ల రూపాయలు. తనకు నిహారిక, నిసా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం డబ్బు అవసరం అవుతుందని ఆమె చెబుతున్నారు. ఆమె అడిగినంత ఇవ్వడానికి గౌతమ్‌ సింఘానియా అంగీకరించారట! సింఘానియాకేమో ఫ్యామిలీ ట్రస్టును ఏర్పాటు చేసి, కుటుంబఆస్తులను ట్రస్ట్‌కు బదిలి చేయాలని, దానికి ఒకరే మేనేజింగ్‌ ట్రస్టీగా ఉండాలని ఉంది. తన మరణం తర్వాత తన కుటుంబసభ్యులకే ఆ ఆస్తులు చేరేలా ఏర్పాటు చేయాలని సింఘానియా కోరినట్టు కొన్ని వార్తలు వెలవడ్డాయి. అయితే ఇవేవీ నవాజ్‌ మోదీకి ఇష్టం లేదు. కోరినంత డబ్బు ఇస్తే చాలని ఆమె అనుకుంటోంది. సింఘానియాకు ఖైతాన్‌ అండ్‌ కో సంస్థకు చెందిన హైగ్రేవ్‌ ఖైతాన్‌, నవాజ్‌ మోదీకి ముంబాయికి చెందిన న్యాయవాది రష్మీ న్యాయ సలహాదారులుగా ఉన్నారు. 32 ఏళ్ల పాటు కలిసి ఉన్నామని, తల్లిదండ్రులుగా బాధ్యతలను నిర్వర్తించామని, ఇన్నేళ్లు చాలా విశ్వాసంతో గడిపామని సింఘానియా, నవాజ్‌ మోదీ చెబుతున్నారు. తమ జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చాయని, దాంతో నిరాధారమైన పుకార్లు, గాసిప్‌లు చక్కర్లు కొట్టాయని, కొన్ని కారణాల వల్ల తాను నవాజ్‌మోదీతో విడిపోతున్నాను అని గౌతమ్‌ సింఘానియా వెల్లడించారు. నవాజ్ మోదీ దక్షిణ ముంబైలో ఏరోబిక్స్, వెల్‌నెట్‌ నిపుణులుగా పని చేస్తున్నారు. దాంతోపాటు బాడీ ఆర్ట్, ఫిట్‌నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. 11,875.42 కోట్ల రూపాయల విలువైన రేమండ్ లిమిటెడ్ బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు.

Updated On 20 Nov 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story