టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సోమవారం ఢిల్లీ(Delhi) వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష(Hunger Strike) చేపట్టనున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు(Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి(Bhuvaneswari).. గాంధీ జయంతి(Gandhi jayanthi)సందర్భంగా అరెస్ట్‌ను నిరసిస్తూ దీక్ష చేప‌ట్టాల‌ని నిర్ణయించారు.

టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సోమవారం ఢిల్లీ(Delhi) వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష(Hunger Strike) చేపట్టనున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు(Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి(Bhuvaneswari).. గాంధీ జయంతి(Gandhi jayanthi)సందర్భంగా అరెస్ట్‌ను నిరసిస్తూ దీక్ష చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. వారి నిర్ణయాన్ని మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టాలని లోకేష్ అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ ఎంపీ కనకమేడల(MP Kanakamedala) నివాసంలో లోకేశ్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొనబోతున్నారు.

చంద్రబాబు తనను నిర్భంధించిన రాజ‌మండ్రి సెంట్రల్‌ జైల్లో నిరసన దీక్ష చేపట్టనున్నారు. చంద్ర‌బాబు ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చంద్ర‌బాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో ఒకరోజు దీక్ష చేస్తారని తెలిపారు. ఇందుకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Updated On 1 Oct 2023 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story