కర్నాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో మునిగి తేలుతున్న 50 మందికి పైగా అరెస్ట్‌ చేశారు.

కర్నాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో మునిగి తేలుతున్న 50 మందికి పైగా అరెస్ట్‌ చేశారు. మైసూరు(Mysore) తాలూకాలోని మీనాక్షిపుర(Meenakshipura) సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో రేవ్‌పార్టీ(Rave Party) జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడికి వెళ్లి పార్టీని భగ్నం చేశారు. 15 మందికి పైగా యువతులు ఎక్కువ మోతాదులో డ్రగ్స్‌ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరి (ఎఫ్‌సీఎల్‌) బృందం కూడా అక్కడికి చేరుకుంది. పార్టీలో డ్రగ్స్‌ వినియోగంపై సోదాలు నిర్వహించింది. పోలీసుల అదుపులో ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉంటే రేవ్‌పార్టీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రియాక్టయ్యారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ehatv

ehatv

Next Story