చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్న తల్లీకూతుళ్లు కత్తులతో పరస్పరం పొడుచుకున్నారు. ఈ ఘర్షణలో కూతురు ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. బెంళూరు(Bengaluru)లోని బనశంకరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.

చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్న తల్లీకూతుళ్లు కత్తులతో పరస్పరం పొడుచుకున్నారు. ఈ ఘర్షణలో కూతురు ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. బెంళూరు(Bengaluru)లోని బనశంకరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అసలేం జరిగిందంటే ఇటీవల కర్ణాటక(Karnataka) మాధ్యమిక విద్య (ఇంటర్మీయట్‌తో సమానం) పరీక్ష ఫలితాలు వచ్చాయి. 40 ఏళ్ల పద్మజ తన కూతురు మార్కుల షీట్‌ చూసి కోపగించుకుంది. మార్కులు తక్కువెందుకు వచ్చాయని 17 ఏళ్ల తన కూతురును అడిగింది. ఆ మాత్రం దానికే కోపం తెచ్చుకున్న కూతురు కత్తి తీసుకుని తల్లిని నాలుగుసార్లు పొడిచింది. తల్లి కూడా కత్తి తీసుకుని కూతురుపై దాడికి దిగింది. తీవ్ర కత్తిపోట్లకు గురైన కూతురు ఘటనస్థలిలోనే చనిపోయింది. రక్తస్రావంతో తీవ్రంగా గాయపడిన పద్మజను ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 29 April 2024 10:50 PM GMT
Ehatv

Ehatv

Next Story