దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) ఘోరం జరిగింది. సుందర్‌నగరి(Sundar Nagari) ప్రాంతలో దివ్యాంగ ముస్లిం(Muslim) వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. మహ్మద్‌ ఇసార్‌(Mohammad Isar) అనే ఆ వ్యక్తి చేసిన పాపమేమిటంటే ఆలయంలో ప్రసాదం తినడమే!

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) ఘోరం జరిగింది. సుందర్‌నగరి(Sundar Nagari) ప్రాంతలో దివ్యాంగ ముస్లిం(Muslim) వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. మహ్మద్‌ ఇసార్‌(Mohammad Isar) అనే ఆ వ్యక్తి చేసిన పాపమేమిటంటే ఆలయంలో ప్రసాదం తినడమే! దీనికి అతడిని స్తంభానికి కట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. దెబ్బలకు తాళలేక కాసేపటికి చనిపోయాడు. మూక హత్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది. బాధిత వ్య‌క్తిని ప‌లువురు వ్య‌క్తులు క‌ర్ర‌ల‌తో కొడుతుండ‌టం ఆ వీడియో క‌నిపించింది. ఈ ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఆ ప్రాంతంలో పెద్ద‌సంఖ్య‌లో పోలీసులను మోహ‌రించారు.ఘ‌ట‌న‌కు బాధ్యులంద‌రినీ గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలిస్తున్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Updated On 27 Sep 2023 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story