డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఫలితాలను చూస్తే మోదీ ఓటమి పాలయ్యారని.. అయితే టీడీపీ చంద్రబాబు నాయుడు, జేడీయూ నితీష్ కుమార్‌ల మద్దతు వల్లే ఆయన ప్రధాని అయ్యారన్నారు. శనివారం కోయంబత్తూరులో జరిగిన బహిరంగ సభలో తమిళనాడు సీఎం ప్రసంగిస్తూ, 'అబ్కీ బార్, 400 పార్' నినాదంపై బీజేపీ లక్ష్యంగా చేసుకున్నారు. "ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి" అని అన్నారు. "ఇది మోదీ విజయం కాదు, మోదీ ఓటమి.. చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్‌ల వల్లే మోదీ ప్రధాని అయ్యారు, వారు సపోర్ట్ చేయకుంటే మోదీకి మెజారిటీ ఎక్కడి నుంచి వచ్చి ఉండేదో.. వారి కారణంగా ఇకపై బీజేపీ ఏమీ చేయలేదు" అని స్టాలిన్ అన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) 293 సీట్లు గెలుచుకుని మూడోసారి మెజారిటీ సాధించింది. 543 మంది సభ్యులున్న దిగువ సభలో బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలుచుకుంది. మెజారిటీ మార్క్ 272 కాగా.. టీడీపీ, జేడీయూ బీజేపీకి మద్దతు ఇచ్చాయి.


Eha Tv

Eha Tv

Next Story