మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందన్నారు కవిత

ముందుగా ప్రకటించినట్లుగానే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును తేవాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ... బీఆర్ఎస్ పార్టీ.. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా ప్రారంభించింది. ఈ క్రమంలో భాగంగా ... ఎమ్మెల్సీ కవిత.. ఉదయం 10.15కి జంతర్ మంతర్‌ ప్రాంగణంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ దీక్షను ప్రారంభింపజేశారు. దీక్ష ప్రారంభించే ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన కవిత ... ఆ తర్వాత దీక్షాలో కూర్చున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందన్నారు కవిత. ఈ దీక్షకు సీపీఐ , సీపీఎంతోపాటూ... ఎన్సీపీ , టీఎంసీ, సమాజ్‌ వాదీ పార్టీ, డీఎంకే , ఆప్ , నేషనల్‌ కాన్ఫరెన్స్, శివసేన , పీడీపీ, జేడీయూ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్‌ఎల్డీ, జేఎమ్‌ఎమ్‌ సహా 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. సీపీఐ కార్యదర్శి డి.రాజా... ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత దీక్షను విరమింపజేస్తారని సమచారం . ఈ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు, మహిళా మంత్రులు, కార్యకర్తలతోపాటూ... 29 రాష్ట్రాల్లో మహిళా హక్కుల కోసం పోరాడుతున్న వారు కూడా ఇందులో పాల్గొన్నారు.

Updated On 10 March 2023 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story