అక్కా అక్కా అని పిలుస్తూనే ఓ యువతిని చెరపట్టాలని చూశాడు. తాకకూడని చోట తాకే ప్రయత్నం చేశాడు. ఆమెను అనుభవించాలనుకున్నాడు. వాడి ప్రవర్తన చూసి బిత్తరపోయిందా యువతి. వాడి వికృత చేష్టలను అడ్డుకుని హెచ్చరించింది. అంతే వాడిలో భయం మొదలయ్యింది. తన గురించి అందరికీ చెప్పేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమెను దారుణంగా హత్య(Murder) చేసి పాతిపెట్టాడు. దిగ్భ్రాంతి కలిగించే ఈ ఘటన కర్నాటకలోని(Karnataka) మేల్కోటెగ్గరలో జరిగింది.

అక్కా అక్కా అని పిలుస్తూనే ఓ యువతిని చెరపట్టాలని చూశాడు. తాకకూడని చోట తాకే ప్రయత్నం చేశాడు. ఆమెను అనుభవించాలనుకున్నాడు. వాడి ప్రవర్తన చూసి బిత్తరపోయిందా యువతి. వాడి వికృత చేష్టలను అడ్డుకుని హెచ్చరించింది. అంతే వాడిలో భయం మొదలయ్యింది. తన గురించి అందరికీ చెప్పేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమెను దారుణంగా హత్య(Murder) చేసి పాతిపెట్టాడు. దిగ్భ్రాంతి కలిగించే ఈ ఘటన కర్నాటకలోని(Karnataka) మేల్కోటెగ్గరలో జరిగింది. మృతురాలు నందిని(nandini) అందంగా ఉంటుంది. పెళ్లయి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మేల్కోటెమీపంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా(Teacher) పని చేసేవారు. గత శనివారం స్కూల్‌ నుంచి మధ్యాహ్నమే ఇంటికి బయలు దేరింది. కానీ ఆమె ఇంటికి చేరలేదు.

ఇదిలా ఉంటే మేల్కోటె యోగ నరసింహస్వామి కొండ వెనుకభాగంలో ఒక టూ వీలర్‌ పార్క్‌ చేసి ఉందని ఉదయం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనస్థలానికి వచ్చారు. బండికి దగ్గరలో మట్టి తవ్వినట్టు కనిపించింది. అప్పుడు వారికి అనుమానం వచ్చేసింది. వెంటనే ఆ మట్టిని తొలగించారు. వారి అనుమానం నిజమయ్యింది. అక్కడ నందిని మృతదేహం బయటపడింది. నిందితుడు ఆమెను హత్య చేసి
అక్కడ పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. నందినికి రీల్స్‌(Reels) చేయడం అలవాటు. పొద్దస్తమానం అదే పనిలో ఉండటం భర్త లోకేశ్‌కు(Lokesh) నచ్చలేదు. రీల్స్‌ చేయడం మానేయమని ఎన్నిసార్లు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. చెప్పి చెప్పి విసుగొచ్చేసి చెప్పడం మానేశాడు లోకేశ్‌. రెండేళ్ల కిందట నందినికి మేల్కోటెకు చెందిన నితేశ్‌(Nitesh) పరిచయం అయ్యాడు. 22 ఏళ్ల ఆ యువకుడు నందినిని అక్కా అంటూ పలుకరించేవాడు. నందిని హత్య తర్వాత నితేశ్‌ కూడా కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చివరకు అతగాడిని పట్టుకున్నారు. నందిని ఉండేది మాణిక్యనహళ్లి. అక్కడ నుంచి మెయిన్‌ రోడ్డు వరకు ఆమె టూ వీలర్‌పై వెళ్లేవారు. అక్కడ ఓ చోట తన వెహికిల్ను పార్క్‌ చేసి బస్సులో మేల్కోటెలో ఉన్న స్కూల్‌కు వెళ్లేవారు. శనివారం బస్‌ మిస్‌ కావడంతో తన ద్విచక్రవాహనంలోనే స్కూల్‌కు వెళ్లారు.

శనివారం హాఫ్‌ డే కావడంతో మధ్యాహ్నం స్కూల్‌ నుంచి ఇంటికి బయలుదేరారు. మధ్యలో నితీశ్‌ ఆమెకు ఎదురయ్యాడు. ఆమెను యోగ నరసింహస్వామి కొండ వెనక్కు తీసుకెళ్లాడు. ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. నందినిని గత కొద్ది రోజులుగా లోకేశ్‌ చెడు దృష్టిలో చూసేవాడని పోలీసులు చెబుతున్నారు. అక్క-తమ్ముడిలా ఇద్దరూ కొన్ని రీల్స్‌ చేశారు. ప్రేయసీ ప్రియుల్లా రీల్స్‌ చేద్దామని నితేశ్‌ఫోర్స్‌ చేశాడు. అమె అందుకు అంగీకరించలేదు. నితేశ్‌ క్రమంగా ఆమె మోహంలో పడ్డాడు. ఓసారి ఆమెను తాకాడు కూడా! అప్పుడే నితేశ్‌ను చెడామడా తిట్టేశారు నందిని. ఈ విషయం బయటకు పొక్కుతుందన్న భయంతోనే ఆమెను హత్య చేశానని నితేశ్‌ అంగీకరంచాడని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన రోజు, వారిద్దరూ గొడవ పడుతున్న దృశ్యాలను గుట్టపై నుంచి ఒక పర్యాటకురాలు వీడియో తీసింది. ఆ వీడియోను పోలీసులకు అందించింది. అందులో నితేశ్‌స్పష్టంగా కనిపిస్తున్నాడు. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన వాడు కావడం, కుటుంబసభ్యులు రాజకీయాలతో సంబంధం ఉన్నవారు కావడంతో పోలీసుల దర్యాప్తు కాసింత నత్తనడకన సాగింది. డబ్బుతో పోలీసులను మేనేజ్‌ చేద్దామనుకున్నాడు నితేశ్‌. హత్య చేసిన తర్వాత రెండు రోజుల పాటు మేల్కోటెలోనే నితేశ్‌ఉన్నాడు. అక్క ఏమైంది? ఎక్కడకు వెళ్లింది? అంటూ అమాయకంగా అడిగేవాడట నితేశ్‌!

Updated On 25 Jan 2024 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story