తమిళనాడు ఎంపీ ఎ. గణేష్‌మూర్తి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. టికెట్ రాకపోవడంతో ఆయ‌న‌ విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

తమిళనాడు ఎంపీ ఎ. గణేష్‌మూర్తి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. టికెట్ రాకపోవడంతో ఆయ‌న‌ విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయ‌న‌ పరిస్థితి విషమించ‌డంతో మ‌ర‌ణించారు.

గణేష్‌మూర్తి తాను విషం తీసుకున్న విషయాన్ని ఇంతకు ముందు ఎవరికీ చెప్పలేదు. అయితే వాంతులు, అసౌకర్యం కలగడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో గణేష్‌మూర్తి విషం (పురుగుమందు) తాగినట్లు వైద్యులు కుటుంబసభ్యులకు తెలియజేశారు.

గణేష్‌మూర్తి ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయ‌న‌ను వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. అనంతరం కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన గణేష్‌మూర్తి చివ‌రికి ఓడిపోయారు. గణేష్‌మూర్తి మృతిప‌ట్ల రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

Updated On 27 March 2024 10:34 PM GMT
Yagnik

Yagnik

Next Story