కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం మణిపూర్‌లోని ఇంఫాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. కుల హింస మంటల్లో రగులుతున్న మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ కసరత్తులో భాగంగా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మణిపూర్‌కు మంగళవారం వచ్చిన హోంమంత్రి అమిత్ షా.. మైతీ, కుకీ గ్రూపులు, రాష్ట్రంలోని ప్రముఖులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సివిల్ సర్వెంట్లు, మహిళా నేతలతో సమావేశమయ్యారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) గురువారం మణిపూర్‌(Manipur)లోని ఇంఫాల్‌(Imphal)లో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. కుల హింస మంటల్లో రగులుతున్న మణిపూర్‌(Manipur)లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ కసరత్తులో భాగంగా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మణిపూర్‌కు మంగళవారం వచ్చిన హోంమంత్రి అమిత్ షా.. మైతీ(Meitei), కుకీ(Kuki) గ్రూపులు, రాష్ట్రంలోని ప్రముఖులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సివిల్ సర్వెంట్లు, మహిళా నేతలతో సమావేశమయ్యారు. రెండో రోజు పర్యటనలో పార్టీ సమావేశంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మేధోమథనం చేశారు.

బుధవారం అమిత్ షా పౌర సమాజ సంస్థలు, భద్రతా బలగాలతో విస్తృతంగా చర్చించారు. హింసను అరికట్టేందుకు, దోచుకున్న ఆయుధాలను స్వాధీనం చేసుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి, శ్రేయస్సుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని షా చెప్పారు. రాష్ట్రంలో ఘర్షణల్లో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం, రాష్ట్రం రెండూ సగం ఖర్చు భరిస్తాయి. అల్లర్లలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ప్ర‌క‌టించారు. మే 3న ప్రారంభమైన మైతీ, కుకీ కమ్యూనిటీల మధ్య హింసలో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.

ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్(Biren Singh) నివాసంలో అమిత్‌త్‌ షా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో హింసాకాండను నియంత్రించి సాధారణ స్థితిని పునరుద్ధరించే మార్గాలపై చర్చించారు. మణిపూర్ పోలీసు(Manipur Police), సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ఇండియన్ ఆర్మీ(Indian Army) సీనియర్ అధికారులతో కూడా షా సమావేశమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలు జరిగినా కఠినంగా వ్యవహరించాలని భద్రతా అధికారులను ఆదేశించారు.

Updated On 31 May 2023 8:52 PM GMT
Yagnik

Yagnik

Next Story