మణిపూర్లో శాంతి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ అధ్యక్షతన 51 మంది సభ్యులతో కూడిన శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీఎం ఎన్ బీరేన్ సింగ్ సహా మేధావి వర్గాలకు చెందిన వారు, వివిధ తెగల ప్రతినిధులు ఉన్నారు.

Manipur Violance Kuki Members Boycott Centre Peace Committee Over Cm Biren Singh
మణిపూర్(Manipur)లో శాంతి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ అధ్యక్షతన 51 మంది సభ్యులతో కూడిన శాంతి కమిటీ(Centre Peace Committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీఎం ఎన్ బీరేన్ సింగ్(CM Biren Singh) సహా మేధావి వర్గాలకు చెందిన వారు, వివిధ తెగల ప్రతినిధులు ఉన్నారు. ఈ శాంతి కమిటీలో చేరేందుకు కుకీ తెగకు చెందిన చాలా మంది ప్రతినిధులు(Kuki Members) నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ ప్యానెల్లో సీఎం ఎన్ బీరెన్ సింగ్, ఆయన మద్దతుదారులు కూడా ఉన్నారని, అందుకే ఈ శాంతి కమిటీ(Peace Committee)ని బహిష్కరిస్తామని కుకీ తెగ ప్రతినిధులు చెబుతున్నారు. శాంతి కమిటీలో చేర్చకముందు మమ్మల్ని దీని గురించి అడగలేదని కుకీ ప్రతినిధులు అంటున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చర్చలకు అనుకూల పరిస్థితులు కల్పించాలి.
మీడియా నివేదికల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతి కమిటీలో కోకోమి(Cocomi) కూడా చేర్చబడింది. కుకీ తెగకు చెందిన ప్రజలు కోకోమి గ్రూప్ ప్రజలపై యుద్ధం ప్రకటించిందని ఆరోపిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో హింస కొనసాగినప్పుడు మేము మణిపూర్ ప్రభుత్వంతో చర్చలు జరపలేము. మణిపూర్కు చెందిన గిరిజన సంస్థ ఐటీఎల్ఎఫ్(ITLF) కూడా శాంతి కమిటీ ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. శాంతి కమిటీ ఏర్పాటుకు ముందు పరిస్థితి సాధారణంగా ఉండాల్సిన అవసరం ఉందని సంస్థ చెబుతోంది. ఐటీఎల్ఎఫ్ రాష్ట్రంలో తక్షణమే శాంతిని నెలకొల్పాలని మాట్లాడినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ శాంతి కమిటీలో చేరడాన్ని వ్యతిరేకించింది. మణిపూర్లో హింస(Manipur Violance) ప్రారంభమై నెల దాటింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
