ఐదు వేలు అడిగితే ఇవ్వలేదని కన్న తల్లిని హత్యచేశాడు(Murder) ఓ ప్రబుద్ధుడు. తన తల్లిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని(Dead body) సూట్‌కేసులో(Suitcase) కుక్కి ప్రయాగ్‌రాజ్‌లోని(Prayagraj) త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద పడేసేందుకు ప్రయత్నించాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన హర్యానాలో(Haryana) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఐదు వేలు అడిగితే ఇవ్వలేదని కన్న తల్లిని హత్యచేశాడు(Murder) ఓ ప్రబుద్ధుడు. తన తల్లిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని(Dead body) సూట్‌కేసులో(Suitcase) కుక్కి ప్రయాగ్‌రాజ్‌లోని(Prayagraj) త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద పడేసేందుకు ప్రయత్నించాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన హర్యానాలో(Haryana) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హర్యానాలోని హిసార్‌లో ప్రతిమాదేవి(Pratima) అనే మహిళ తన కొడుకు హిమాన్ష్‌తో కలిసి ఉంటుంది. తల్లి ప్రతిమాదేవిని 5 వేలు ఇవ్వాలని హిమాన్ష్ కోరగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు హిమాన్ష్‌ ఆమెను గొంతునులిపి దారుణంగా హత్య చేశాడు. తల్లిశవాన్ని మాయం చేయాలని ప్రయత్నించాడు. ఆమె మృతదేహాన్ని సూట్‌ కేసులో కుక్కి ప్రయాగ్‌రాగ్‌ త్రివేణి సంగమం వద్ద పడేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హిమాన్ష్‌ను కొందరు స్థానికులు గమనించారు. అతడు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న లా ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు.. సూట్‌కేసులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హిమాన్ష్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా.. ఐదు వేలు ఇవ్వాలని తల్లిని కోరగా నిరాకరించిందని ఆవేశంతోనే తల్లి గొంతునులిమి(Chocked) చంపేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో హిమాన్ష్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated On 16 Dec 2023 3:09 AM GMT
Ehatv

Ehatv

Next Story