వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు పెద్దలు. నిజమే చావు ఎప్పుడు తరుముకుని వస్తుందో చెప్పలేం. అందుకు ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ.

వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు పెద్దలు. నిజమే చావు ఎప్పుడు తరుముకుని వస్తుందో చెప్పలేం. అందుకు ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ. తమిళనాడు(Tamil Nadu)లోని తిరునెల్వేలి(Tirunelveli)లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన రెండు ఆవులు కొట్లాడుకుంటున్నాయి. ఈ క్రమంలో బైక్‌ మీద వెళుతున్న వేలాయుధరాజ్‌ను ఓ ఆవు కుమ్మింది. దాంతో అతడు ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. అంతలోనే వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు ఆపి డ్రైవర్‌, స్థానికులు Man Knocked Off Bike By Fighting Cows Crushed By Bus In Tamil Nadu Video Goes Viral On Social Mediaదగ్గరకు పరుగెత్తుకుని వెళ్లారు కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. విషయ తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వేలాయుధరాజ్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేలాయుధరాజ్‌ మరణానికి కారణమైన ఆవు మాత్రం నింపాదిగా రోడ్డు దాటి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్‌ అవుతోంది.

Eha Tv

Eha Tv

Next Story