వీడెక్కడి కొడుకు? తల్లిదండ్రులకు సేవ చేయాల్సింది పోయి వారితో సేవలు చేయించుకునేవాడు కొడుకెట్లా అవుతాడు? పైగా కన్నతండ్రి అని కూడా చూడకుండా చంపేశాడు.

వీడెక్కడి కొడుకు? తల్లిదండ్రులకు సేవ చేయాల్సింది పోయి వారితో సేవలు చేయించుకునేవాడు కొడుకెట్లా అవుతాడు? పైగా కన్నతండ్రి అని కూడా చూడకుండా చంపేశాడు. తన పాదాలకు మసాజ్‌ చేయమని తండ్రిని బలవంతం చేశాడా పుత్రరత్నం. పాపం వయసు మీరిపోయిన ఆ తండ్రి తన వల్ల కాదని చెప్పాడు. దాంతో కొడుకుకు కోపం వచ్చేసి తండ్రిని కొట్టి చంపాడు. మహారాష్ట్ర(Maharasta)లోని నాగపూర్‌(Nagpur)లో జరిగింది.

నవాబ్‌పురా(Navabpura)ప్రాంతంలో నివిసించే 62 ఏళ్ల దత్తాత్రేయ షిండే(Dattatreya Shinde)కు ఇద్దరు కొడుకులు. చిన్న కుమారుడు కుశాల్‌ (Khushal) అలియాస్‌ ఇంగా షిండే నేరస్తుడే! అతడికి నేర చరిత్ర ఉంది. శనివారం సాయంత్రం తన పాదాలకు మసాజ్‌ చేయమని తండ్రిని అడిగాడు. వృద్దుడైన తండ్రి తనకు చేతకావడం లేదని సౌమ్యంగా చప్పాడు. అయినా కొడుకుకు కోపం వచ్చింది. వృద్ధుడని కూడా చూడకుండా ఛాతి, కడుపు, పక్కటెముకలు, తలపై బలంగా కొట్టాడు. పెద్ద కుమారుడు ప్రణవ్‌ (Pranav)అడ్డుకునే ప్రయత్నం చేశాడు కానీ, ఇంగా బెదిరించడంతో సాయం కోసం పక్కింటికి వెళ్లాడు. ప్రణవ్‌ తిరిగివచ్చేసరికే తండ్రి తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్నాడు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మరణించాడని డాక్టర్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో కుశాల్‌ను అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story