ఎనుకటి కాలంలో ప్రేమలు, పెళ్లిళ్లు అంటేనే భయపడే రోజులవి.

ఎనుకటి కాలంలో ప్రేమలు, పెళ్లిళ్లు అంటేనే భయపడే రోజులవి. క్లాస్‌మేట్‌నో లేదా మరొకరితో ప్రేమాయణం నడపాలంటే భయంభయంగా ప్రపోజ్ చేసేవారు. ఏదో ఒక ప్రేమ లేఖ పట్టుకొని అమ్మాయిల పుస్తకాల్లోనో మరో చోట ఆమెకు తెలిసేవిధంగా ప్రయత్నాలు జరిగేవి. యువతి వెంటపడుతున్నాడని తెలిస్తే ఆ అమ్మాయి కుటుంబసభ్యులు ఎక్కడ వచ్చి ఒళ్లు హూనం చేస్తారోననని ఆందోళన చెందేవారు. రానురాను పరిస్థితులు మారిపోయాయి. స్మార్ట్‌ ఫోన్లు(smart phone), సామాజిక మాధ్యమాలు(Social media) వచ్చిన తర్వాత పరిచయాలు పెరుగుతున్నాయి. అంతేకాదు అవి కాస్త ప్రేమకు, ఆ తర్వాత మరికొన్ని అయితే వివాహేతర సంబంధాల(Extra marital Affair) వరకు పోతున్నాయి. ఈ తరహాలోనే ఓ యువతి, యువకుడి మధ్య ఫేస్‌బుక్‌లో(Facebook) పరిచయం ఏర్పడింది. ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకునేవారు. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ఈ జంట తమ ఇళ్లలోని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ జంటకు పండంటి బిడ్డ కూడా పుట్టింది.

కానీ దూరపు కొండలు నునుపు అన్న సామెత మరోసారి రుజువైనట్లుంది. ముక్కు, మొహంలేని వాడితో ప్రేమలో పడ్డ ఆ యువతి చివరికి తన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు తన తల్లి ప్రాణాలు కూడా కోల్పోయింది. కర్ణాటక(Karnataka) రాష్ట్రం యాదగిరి జిల్లాలో(Yadagiri) దారుణ ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం(Dowry) కోసం ఉన్మాదిగా మారిన భర్త తన భార్య, అత్తతో పాటు మరో వ్యక్తిని రాడ్డుతో కొట్టి చంపాడు. యాదగిరి తాలూకా మునగల్ గ్రామానికి చెందిన నవీన్, అన్నపూర్ణ ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఏడాది వయసున్న చిన్నారి కూడా ఉంది. అయితే రానురాను నవీన్‌కు అదనపు కట్నం మీద ఆశ ఎక్కువైంది. కొంతకాలంగా అదనపు కట్నం తేవాలని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే చాలా తెచ్చానని, వారి దగ్గర ఏమీ లేవని తేల్చిచెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదరడంతో నవీన్‌పై విసుగుచెందిన భార్య అన్నపూర్ణ బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత నవీన్‌ అత్తగారింటికి వెళ్లి అన్నపూర్ణను తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఆమె తిరిగి కాపురానికి రాలేదు. దీంతో కోపం పెంచుకున్న నవీన్‌ అత్తింటివారిపై దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో అన్నపూర్ణ, అత్త కవిత, మరో వ్యక్తి బసవరాజప్పపై దాడికి పాల్పడి హత్య చేశాడు. ముగ్గురి మృతదేహాలను జోలదాగి గ్రామ శివారులో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. భర్త చేసిన పనికి అనాథగా చిన్నారి.

Eha Tv

Eha Tv

Next Story