ఐదు నిండు ప్రాణాలు బలి

ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. భార్య వివాహేతర సంబంధం(Extra marital affair) పెట్టుకుందని తరుచుగా గొడవపడేవారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా భార్యభర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. తన భార్య వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిని చంపి(Murder) తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. ఈ దారుణఘటన బీహార్‌లో(Bihar) చోటు చేసుకుంది. బీహార్‌ పోలీసు విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ నీతు కుమారి ఎస్‌ఎస్‌పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త పేరు పంకజ్‌ అని పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురు మృతుల పేర్లను వివరించలేదు. దారుణానికి ముందు సోమవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గొడవపడినట్టు స్థానికులు పేర్కొన్నారు. భార్యకు గల వివాహేతర సంబంధాన్ని భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సూసైడ్‌ లేఖలో హంతకుడు పేర్కొన్నాడు.

Eha Tv

Eha Tv

Next Story