ఈ కాలంలో స్వేచ్ఛ ఎక్కువైంది. టీనేజ్‌(Teenage) కూడా దాటకుండానే పాఠాలు చదవాల్సిన వయసులో ప్రేమ పాఠాలు చదువుతున్నారు.

ఈ కాలంలో స్వేచ్ఛ ఎక్కువైంది. టీనేజ్‌(Teenage) కూడా దాటకుండానే పాఠాలు చదవాల్సిన వయసులో ప్రేమ పాఠాలు చదువుతున్నారు. ఫ్రీడం పేరుతో పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడంతో ఎగరలేకున్నా రెక్కలొచ్చిన పక్షుల్లా విహరిస్తున్నారు. ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారు. జీవితం మీద అవగాహన, మెచ్యురిటీ లేకుండానే ప్రేమలు, పెళ్లిళ్ల పేరుతో ఇళ్లల్లో చిచ్చులు పెట్టడమే కాకుండా, ఎంతో కష్టపడి కనిపెంచిన తల్లిదండ్రుల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నారు. కళ్లెదుటే కన్నవారిని కోల్పోతుండడంతో చివరి రోజుల్లో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారుతోంది. ఈ తరహాలోనే ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంతలోనే ప్రియుడే ఆమె పాలిట యముడయ్యాడు. ప్రియురాలిని చంపి పూడ్చిపెట్టాడు. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

కర్నాటక(Karnataka) రాష్ట్రం శివమొగ్గ జిల్లా హుసానానగర్‌(Husana nagar) తాలుకా ఖయాపూరలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిక్కమగళూరు జిల్లా కొప్పకు చెందిన సౌమ్య, శివమొగ్గ జిల్లా సాగర్‌కు చెందిన సృజన్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తీర్థహళ్లిలో ఓ ఫైనాన్స్ కంపెనీలో సృజన్ వర్క్ చేస్తున్నాడు. సౌమ్య నర్సింగ్ చేస్తుంది. అయితే సృజన్‌ ఇంకా జీవితంలో ఇంకా బాగా సెటిల్‌ కావాలని ఉండేది. దీంతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. మరోవైపు సౌమ్య కుటుంబసభ్యులు ఆమె పెళ్లి సంబంధాలు తెస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఆమె ప్రియుడు సృజన్‌ దగ్గిరికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. ఇంకా సెటిల్ కానందున పెళ్లి ఇప్పుడే వద్దు అంటూ వాయిదా వేస్తున్నాడు సృజన్. కానీ సౌమ్య మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో సౌమ్య ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. సౌమ్యను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే సౌమ్య గొంతు కోసి మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు.

మరోవైపు సౌమ్య కనిపించడం లేదని సౌమ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌమ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు సృజన్‌ వ్యవహారంపై ఓ కన్ను వేశారు. అతనిపై అనుమానం వచ్చి తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. జులై 2న తీర్థహళ్లికి వెళ్తానని చెప్పి సౌమ్య వచ్చింది. తనను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్లాలని సృజన్‌తో గట్టిగా చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కత్తితో గొంతు కోయడంతో సౌమ్య అక్కడే చనిపోయింది. మృత దేహాన్ని ముంబాలు ప్రాంతోంలో పూడ్చిపెట్టాడు. నిందితుడు సృజన్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు పోలీసులు

Eha Tv

Eha Tv

Next Story