నా ప్రియురాలు నాకే సొంతం ..నాకు న్యాయం చేయండి అంటూ ఓ ప్రియుడు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాడు.

నా ప్రియురాలు నాకే సొంతం -ఆమెను తన భర్త నుంచి విడిపించండి :

నా ప్రియురాలు నాకే సొంతం ..నాకు న్యాయం చేయండి అంటూ ఓ ప్రియుడు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాడు ...అది కూడా భర్త నుంచి ఏంటి.? అనే సందేహం వస్తోంది కదూ! దీంతో కోర్టు దిమ్మ తిరిగి ..మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం ఇచ్చింది.. ఈ విచిత్రమైన సంఘటన గుజరాత్‌లో జరిగింది. లివ్‌ ఇన్ అగ్రిమెంట్‌ ప్రకారం తన ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించాలని వస్కాంత జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ఇంతకీ ఆ ప్రియుడు ప్రియురాలు కోసం ఎందుకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వింత స్టోరీని చూడండి.

ప్రేమలు..ప్రేమికులు..కలవడాలు ..విడిపోవడాలు అన్ని కామన్ గా వింటుూ ఉంటాం.. కానీ ఇలాంటి వింత ప్రేమ ఎప్పుడు చూసి ఉండరు... ఇంతకీ విషయం ఏంటంటే .. వస్కాంత జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తాను కస్టడీ కోరుతున్న మహిళ తనతో సంబంధం కలిగి ఉందని కోర్టుకు తెలిపాడు .. తన ప్రియురాలి ఇష్టానికి విరుద్ధంగా మరొకరితో వివాహం జరిగింది. వారిద్దరూ కలిసి జీవించలేకపోయారు. ఆమె తన భర్తను విడిచిపెట్టి నా వద్దకు వచ్చింది. అనంతరం మేమిద్దరం లివ్‌-ఇన్‌ రిలేషన్‌ షిప్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేశాము అంటూ కోర్టుకు చెప్పుకొచ్చాడు. అంతేకాదు కొన్ని రోజుల తర్వాత తన లవర్ కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా భర్త వద్దకు తీసుకెళ్లి వదిలి వచ్చారు. దీంతో తన ప్రియురాలి కోసం హెబియన్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేస్తూ.. తన ప్రియురాలు ఆమె భర్త అక్రమ కస్టడీలో ఉందని, ఆమె ఇష్టానికి విరుద్దంగా తల్లిదండ్రులు ఇలా చేశారని, ఎలాగైనా ఆమెను తిరిగి తన వద్దకు చేర్చాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.

అయితే అక్కడి ప్రభుత్వం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేయడానికి అతనికి ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. స్త్రీ తన భర్త కస్టడీలో ఉంటే ఆమె అక్రమ కస్డడీలో ఉందని చెప్పలేమన్నారు. కేసును విచారించిన జస్టిస్‌ వీఎం పంచోలి, జస్టిస్‌ హెచ్‌ఎం ప్రచ్చక్‌లతో కూడిన ధర్మాసనం.. పిటిషనర్‌తో ఆ మహిళలకు వివాహం జరగలేదని, అలాగే ఆమె తన భర్త నుంచి కూడా విడాకులు తీసుకోలేదని పేర్కొంది. కాబట్టి పిటిషనర్‌ ఆరోపించినట్లుగా ఆ మహిళ తన భర్తతో అక్రమ కస్డడీలో ఉందని చెప్పలేమని తేల్చి చెప్పారు. ఈ పిటిషన్‌ను దాఖలు చేయడానికి పిటిషన్‌ర్ కు ఎలాంటి హక్కులేదని, ఇందుకు గాను పిటిషనర్‌పై రూ. 5000 జరిమాన విధించారు. జరిమానాను స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. నా ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించండి అని ...కోర్టు మెట్లెక్కిన వ్యక్తికి న్యాయస్థానం ఈ విధంగా బుద్ది చెప్పింది.

Updated On 18 March 2023 4:17 AM GMT
Ehatv

Ehatv

Next Story