ఎట్టకేలకు ప్రజాస్వామ్యంలో గొప్ప పండుగ ముగిసే సమయం వచ్చింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాల్లో ఏడో, చివరి దశ లోక్‌సభ ఎన్నికలకు శనివారం ఉద‌యం ఓటింగ్ ప్రారంభ‌మైంది.

ఎట్టకేలకు ప్రజాస్వామ్యంలో గొప్ప పండుగ ముగిసే సమయం వచ్చింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాల్లో ఏడో, చివరి దశ లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections)కు శనివారం ఉద‌యం ఓటింగ్ ప్రారంభ‌మైంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) బ‌రిలో ఉన్న‌ వారణాసి సీటు కూడా ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు.. ఏడవ, చివరి దశలో 57 స్థానాల్లో పోటీ చేసే ప్రముఖుల‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, మనీష్ తివారీ, కంగనా రనౌత్, మిసా భారతి, అభిషేక్ బెనర్జీ తదితరులు ఉన్నారు.

చివరి దశ లోక్‌స‌భ‌ ఎన్నికలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, చండీగఢ్ రాష్ట్రాల‌లోని ప‌లు స్థానాలకు జ‌రుగ‌నున్నాయి. ఉత్తరప్రదేశ్-13, పంజాబ్-13, పశ్చిమ బెంగాల్-9, బీహార్-8, ఒడిశా-6, హిమాచల్ ప్రదేశ్-4, జార్ఖండ్-3, చండీగఢ్-ఒక సీటుకు పోలింగ్ జ‌రుగుతుంది. దీంతో రెండున్నర నెలలకు పైగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పండుగ కూడా ముగియ‌నుంది. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నాయి.

ఎన్నికల సంఘం ప్రకారం ఈ ఏడవ, చివరి దశ ఎన్నికల్లో పది కోట్ల మందికి పైగా ఓటర్లు పాల్గొంటారు. వీరిలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళా ఓటర్లు, 3,572 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు 1.09 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు 486 లోక్‌సభ స్థానాలకు ఆరు దశల్లో పోలింగ్‌ జరగడం గమనార్హం. ఈ సీట్లన్నింటిలో జ‌రిగిన పోలింగ్ ద్వారా అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మార్చి 16న లోక్‌సభ ఎన్నికలు ప్రకటించారు. కాగా, తొలి విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరిగింది.

Updated On 31 May 2024 8:54 PM GMT
Yagnik

Yagnik

Next Story