కేర‌ళ రాష్ట్ర పేరును కేర‌ళంగా మార్చాల‌ని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.

కేర‌ళ రాష్ట్ర పేరును కేర‌ళంగా మార్చాల‌ని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఆ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌తిప‌క్షాల‌తో పాటు అంద‌రూ ఏక‌గ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. పేరు మార్పున‌కు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వ‌ర‌లో కేంద్రానికి పంప‌నున్నారు. గ‌త ఏడాది ఆగ‌స్టు 9వ తేదీన కూడా శాసనసభ ఇదే తరహా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఆ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చిందని రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తు చేసింది.

Eha Tv

Eha Tv

Next Story