అయోధ్య(Ayodhya)లో నిర్మితమైన కొత్త రామాలయంలో ఈ నెల 22వ తేదీన శ్రీరాముడు కొలువుతీరబోతున్నాడు. సీతా లక్ష్మణ హనుమాన్‌ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ అనే శిల్పి రూపొందించాడు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు.

అయోధ్య(Ayodhya)లో నిర్మితమైన కొత్త రామాలయంలో ఈ నెల 22వ తేదీన శ్రీరాముడు కొలువుతీరబోతున్నాడు. సీతా లక్ష్మణ హనుమాన్‌ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ అనే శిల్పి రూపొందించాడు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి (Prahlad Joshi)సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. తన ఎక్స్‌ (ట్విట్టర్‌) అకౌంట్‌లో ప్రహ్లాద్‌ జోషి 'శ్రీరాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు. అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌(Arun Yogiraj) తయారు చేసిన రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. రాముడు,ఆంజనేయుడికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇదో ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యం జరిగినదనడంలో సందేహం లేదు’ అని ప్రహ్లాద్‌ జోషి రాసుకొచ్చారు. నేపాల్లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్తాన్‌, ఒడిశా నుంచి రాముడి విగ్రహాలకు మొత్తం 12 నాణ్యమైన శిలలను సేకరించింది అయోధ్య రామాలయ ట్రస్ట్‌. ఈ శిలలన్నింటినీ పరీక్షించిన తర్వాత రాజస్తాన్‌, కర్ణాటక రాళ్లు మాత్రమే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నాయని తేలిది. కర్ణాటకలో లభించిన శ్యామ శిల, రాజస్థాన్‌లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్‌లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే శిల్పాలు చెక్కేందుకు కర్ణాటకలోని శ్యామశిల అనువుగా ఉంటుంది. నీటి నిరోధకతను కలిగి ఉంటడం ఈ శిలల ప్రత్యేకత. సుదీర్ఘకాలం మన్నుతాయి. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడే అరుణ్ యోగిరాజ్. 37 ఏళ్ల అరుణ్‌ ఎంబీఏ చదివారు. యోగిరాజ్ కుటుంబంలో ఈయన అయిదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు.మహారాజా జయచామరాజేంద్ర వడయార్‌తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారుచేసిన అనుభవం అరుణ్‌కు ఉంది. కేదార్‌నాథ్‌లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని చెక్కింది కూడా ఈయనే! అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు అరుణ్‌. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే కావడం గమనార్హం.

Updated On 2 Jan 2024 1:31 AM GMT
Ehatv

Ehatv

Next Story