పెళ్లి చేసుకునేందుకు వధువు దొరక్క ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో వివాహం చేసుకునేందుకు వధువు దొరక్కపోవడంతో ఓ రైతు విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని 36 ఏళ్ల మంజునాథ్ నాగనూర్‌గా గుర్తించారు.

పెళ్లి చేసుకునేందుకు వధువు దొరక్క ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో వివాహం చేసుకునేందుకు వధువు దొరక్కపోవడంతో ఓ రైతు విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని 36 ఏళ్ల మంజునాథ్ నాగనూర్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు ఎనిమిదేళ్లుగా మంజునాథ్ వధువు కోసం నిజాయితీగా అన్వేషిస్తున్నాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అత‌డు తీవ్ర నిరాశకు గురయ్యాడు. మంజునాథ్ తన మ‌నోవేదనను పంచుకుంటూ ఒక సుసైడ్‌ నోట్ రాసి విషం తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు.

మంజునాథ్ సూసైడ్‌ నోట్‌ను గుర్తించిన పోలీసులు.. పెళ్లికూతురు దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పడుతున్న బాధలు త‌న‌ను వేధిస్తున్నాయని లేఖ‌లో పంచుకున్నాడని వెల్ల‌డించారు. నిస్సహాయత, నిస్పృహతో ఉక్కిరిబిక్కిరై తాను జీవితాన్ని ముగించాలనుకుంటున్న‌ట్లు లేఖలో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి మంజునాథ్ మృతికి సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు.

Updated On 24 Jun 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story