మే 10న జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌లో శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా కనసినకట్టె గ్రామంలో రోడ్లు, మొబైల్ కనెక్టివిటీతో పాటు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు నిర్వాసితులు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ ఎన్నిక‌ల‌లో గ్రామంలోని ముగ్గురు మాత్రమే ఓటు వేశారు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు, పార్టీ శ్రేణులు గ్రామంలోకి రావద్దని గ్రామస్తులు బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.

మే 10న జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌(Karnataka Elections)లో శివమొగ్గ(Shivamogga) జిల్లా భద్రావతి తాలూకా(Bhadravati Taluk) కనసినకట్టె(Kanasinakatte) గ్రామంలో రోడ్లు(Roads), మొబైల్ కనెక్టివిటీ(Mobile Connectivity)తో పాటు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు నిర్వాసితులు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ ఎన్నిక‌ల‌లో గ్రామంలోని ముగ్గురు మాత్రమే ఓటు వేశారు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు, పార్టీ శ్రేణులు గ్రామంలోకి రావద్దని గ్రామస్తులు బ్యానర్‌(Banner)ను ఏర్పాటు చేశారు. గ్రామం మొత్తం ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుసుకున్న ఎన్నికల సంఘం అధికారులు ప్రజల ఆలోచనలను మార్చేందుకు పలు చర్యలు చేపట్టారు. దీంతో ఓటును వినియోగించుకోమ‌ని గ్రామస్థులు మొండికేశారు. ముగ్గురు వ్యక్తులు మినహా గ్రామంలోని ఎవరూ ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు రాలేదని స్థానిక అధికారి ధృవీకరించారు.

దీనికి విరుద్ధంగా అదే శివమొగ్గలోని దొడ్డమట్టి(Doddamatti) గ్రామస్థులు ఓటు వేయాలని కోరుతూ ఏ అభ్యర్థి గానీ, పార్టీ గానీ గ్రామస్తులను అడ‌గ‌నప్పటికీ.. ఓటింగ్ న‌మోదైంది. గ్రామంలో 249 మంది ఓటర్లు ఉండగా.. 200 మందికి పైగా ఓటు వేశారు. గ్రామం నుండి పట్టభద్రుడైన కిరణ్ అనే వ్య‌క్తి మాట్లాడుతూ.. మా ఓట్లు కోరుతూ ఏ అభ్యర్థి కూడా మా గ్రామానికి రాలేదు. కానీ, మనమందరం బాధ్యతాయుతమైన పౌరులం. మేము తప్పకుండా ఓటు వేస్తాం అని పేర్కొన్నాడు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా గ్రామంలోని యువకులు చాలా మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని తెలిపాడు. అయినప్పటికీ.. ప్రభుత్వం, ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధిపై శ్రద్ధ చూపడం లేదని వాపోయాడు. కుమ్సి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్(Reserve Forest) ద‌గ్గ‌ర‌ గ్రామం ఉన్నందున.. సరైన రహదారి, రవాణా సౌకర్యాల నుండి మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ వరకు గ్రామస్తులు అనేక డిమాండ్లను కలిగి ఉన్నారని వివ‌రించాడు.

Updated On 11 May 2023 11:25 PM GMT
Yagnik

Yagnik

Next Story