శరన్నవరాత్రులు(Navratri) ఆఖరి దశకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలంతా పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా, దుర్గాష్టమి(Durgastami) సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) గోండా(Gonda) జిల్లాలో కూడా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గొండాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం శక్తి వందనాన్ని నిర్వహించారు.

శరన్నవరాత్రులు(Navratri) ఆఖరి దశకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలంతా పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా, దుర్గాష్టమి(Durgastami) సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) గోండా(Gonda) జిల్లాలో కూడా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గొండాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం శక్తి వందనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేశారు. కన్యాభోజనం ఏర్పాటు చేశారు. షాహీద్‌-ఎ-ఆజం సర్దార్‌ భగత్‌సింగ్‌ ఇంటర్‌ కాలేజీ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం శక్తివందనం వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశంలోనే భారీ స్థాయిలో కన్యాపూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు. జిల్లా యంత్రాంగం ఘనమైన ఏర్పాట్లు చేయగా, 11,888 మందికి పైగా బాలికలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కన్యా పూజ వేడుకలో జీరో వేస్ట్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ భారీ కార్యక్రమంలో మొత్తం 138 కిలోల తడి చెత్త, సుమారు 70 కిలోల పొడి చెత్త ఏర్పడింది. ఈ వ్యర్థాలను అక్కడికక్కడే పూర్తిగా తొలగించేలా ఏర్పాట్లు చేశారు. తడి చెత్తను పారవేసేందుకు వేదిక వద్ద కంపోస్టు పిట్‌ను ఏర్పాటు చేశారు.

Updated On 23 Oct 2023 2:22 AM GMT
Ehatv

Ehatv

Next Story