ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాన్పూర్‌లో(Kanpur) ఘోరం జరిగింది. పదో తరగతి విద్యార్థిని టీచర్‌ ప్రియుడు హత్య చేశాడు. పథకం ప్రకారం స్టోర్‌రూమ్‌కు తీసుకెళ్లి చంపేశాడు. అంతకాకుండా మీ కుమారుడిని కిడ్నాప్‌(Kidnap) చేశానని, విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని యువకుడి తల్లిదండ్రులను బెదిరించాడు కూడా! వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాన్పూర్‌లో(Kanpur) ఘోరం జరిగింది. పదో తరగతి విద్యార్థిని టీచర్‌ ప్రియుడు హత్య చేశాడు. పథకం ప్రకారం స్టోర్‌రూమ్‌కు తీసుకెళ్లి చంపేశాడు. అంతకాకుండా మీ కుమారుడిని కిడ్నాప్‌(Kidnap) చేశానని, విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని యువకుడి తల్లిదండ్రులను బెదిరించాడు కూడా! వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. విద్యార్థిని నిందితుడు బలవంతంగా తీసుకెళ్లలేదని, ఇద్దరూ కలిసి టూ వీలర్‌పై వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రచిత(Rachitha) అనే 21 ఏళ్ల అమ్మాయి కాన్పూర్‌లో ట్యూషన్లు చెబుతుంటుంది. ఆమె దగ్గర పదో తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ట్యూషన్‌ చెప్పించుకునేవాడు. వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానించిన ఆమె ప్రియుడు ప్రభాత్‌ శుక్లా(Prabhath Shukla) ఆ బాలుడిని చంపేయాలనుకున్నాడు. బాలుడి ఇంటికి వెళ్లి రచిత పిలుస్తోందని చెప్పి తనతో పాటు బైక్‌పై తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి ఓ స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. లోపలికి ఇద్దరు వెళ్లారు కానీ, 20 నిమిషాల తర్వాత ప్రభాత్‌ శుక్లా ఒక్కడే బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతడు బట్టలు మార్చుకుని విద్యార్థి తీసుకొచ్చిన బైక్‌తో అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన కంప్లయింట్‌ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడితో పాటు ట్యూషన్‌ టీచర్‌ రచిత, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. బాలుడిని ఎందుకు చంపాడన్న దానిపై కారణాలు తెలియలేదు. కాకపోతే ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated On 31 Oct 2023 7:57 AM GMT
Ehatv

Ehatv

Next Story