క‌న్న‌డ న‌టుడు సూరజ్ కుమార్ అలియాస్ ధ్రువన్ రోడ్డుప్ర‌మాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శనివారం గుండ్లుపేట్ తాలూకాలోని బేగూర్ సమీపంలో మైసూరు-గుండ్లుపేట్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. సూరజ్ కుమార్ కన్నడ రాజ్‌కుమార్‌కు బంధువు. ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న సూరజ్ కుడి కాలును వైద్యులు తొలగించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సూర‌జ్ చిత్రనిర్మాత S. A. శ్రీనివాస్ కుమారుడు. సినిమా రంగ ప్ర‌వేశానికి ముందు సూరజ్ తన పేరును ధృవన్ గా మార్చుకున్నాడు.

క‌న్న‌డ న‌టుడు సూరజ్ కుమార్ (Suraj Kumar) అలియాస్ ధ్రువన్ రోడ్డుప్ర‌మాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శనివారం గుండ్లుపేట్ తాలూకాలోని బేగూర్ సమీపంలో మైసూరు-గుండ్లుపేట్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. సూరజ్ కుమార్ కన్నడ రాజ్‌కుమార్‌కు బంధువు. ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న సూరజ్ కుడి కాలును వైద్యులు తొలగించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సూర‌జ్ చిత్రనిర్మాత S. A. శ్రీనివాస్ కుమారుడు. సినిమా రంగ ప్ర‌వేశానికి ముందు సూరజ్ తన పేరును ధృవన్ గా మార్చుకున్నాడు.

హైవేపై బైక్‌పై వెళుతున్న సూరజ్‌ను గుండ్లుపేట తాలూకాలోని హిరికటి గేట్ సమీపంలో సాయంత్రం 4 గంటల సమయంలో టిప్పర్ ఢీకొనడంతో అతని కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మైసూర్‌కు చెందిన సూరజ్‌ తన బైక్‌పై ఊటీకి వెళ్తూ ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేస్తుండగా.. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. వెంటనే అతడిని మైసూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సూర‌జ్‌ మోకాలికి శస్త్ర చికిత్స చేశారు. ప్రాణాలను రక్షించే ప్రక్రియలో భాగంగా అత‌డి కాలును తొల‌గించారు వైద్యులు.

Updated On 26 Jun 2023 5:49 AM GMT
Ehatv

Ehatv

Next Story