ప్రముఖ నటుడు రజనీకాంత్(Rajinikanth) జార్ఖండ్(Jharkhand) చేరుకున్నారు. జార్ఖండ్ లోని రాజారప్ప చిన్నమస్తిక తల్లికి(Rajarappa Chinna Masthika Thalli) పూజలు చేశారు. రాంచీకి(Ranchi) వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయ‌న‌..

ప్రముఖ నటుడు రజనీకాంత్(Rajinikanth) జార్ఖండ్(Jharkhand) చేరుకున్నారు. జార్ఖండ్ లోని రాజారప్ప చిన్నమస్తిక తల్లికి(Rajarappa Chinna Masthika Thalli) పూజలు చేశారు. రాంచీకి(Ranchi) వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయ‌న‌.. త‌న మిత్రుడైన‌ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను(CP Radha Krishnan) రాజ్‌భవన్‌లో(Raj bhavan) మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ రాధాకృష్ణన్‌.. సోషల్ మీడియా అకౌంట్‌లో సమావేశానికి సంబంధించిన ఫోటోల‌ను పంచుకున్నారు.

గవర్నర్ రాధాకృష్ణన్ పోస్ట్‌లో “రాజ్‌భవన్‌లో జరిగిన మర్యాదపూర్వక సమావేశంలో నా ప్రియమైన స్నేహితుడు, భారతదేశపు గొప్ప నటులలో ఒకరైన సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. జార్ఖండ్ నేల‌పై అడుగుపెట్టిన‌ ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని రాసుకొచ్చారు.

ఇటీవల విడుదలైన రజనీకాంత్ 'జైలర్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన 'జైలర్' చిత్రాన్ని ఆగష్టు 10న మేకర్స్ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసారు. ఈ సినిమా ఇండియ‌న్‌ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది.

Updated On 17 Aug 2023 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story