తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని గవర్నర్ మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. దీంతో.. తొలగింపు ఉత్తర్వులపై గవర్నర్ తాత్కాలిక స్టే విధించారు. బాలాజీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.

Jailed Tamil Nadu minister’s dismissal on hold after Centre’s advice to Governor
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)ని గవర్నర్ మంత్రి మండలి(Cabinet) నుంచి బర్తరఫ్(Suspension) చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు(Ploitics) వేడెక్కాయి. దీంతో.. తొలగింపు ఉత్తర్వులపై గవర్నర్ తాత్కాలిక స్టే(Dismissal on hold)విధించారు. బాలాజీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
తమిళనాడు కేబినెట్ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఉద్వాసన ఉత్తర్వులపై తమిళనాడు గవర్నర్(Tamil Nadu Governor) ఆర్ఎన్ రవి(RN Ravi) తాత్కాలికంగా స్టే విధించారు. ఈ మేరకు గవర్నర్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin)కు లేఖ కూడా పంపారు. దీనిపై అటార్నీ జనరల్(Attorney General)తో చర్చిస్తానని ముఖ్యమంత్రికి పంపిన లేఖ(Letter)లో తెలిపారు. అటార్నీ జనరల్ నుండి న్యాయపరమైన అభిప్రాయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. గురువారం ఉదయం గవర్నర్.. బాలాజీని మంత్రి వర్గం నుండి తొలగించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ.. గవర్నర్కు ఆ హక్కు లేదని.. చట్టపరంగా సవాలు చేస్తానని చెప్పారు.
సెంథిల్ బాలాజీని తొలగిస్తూ రాజ్భవన్(Raj Bhavan) ప్రకటన విడుదల చేసింది. పలు తీవ్రమైన కేసుల్లో బాలాజీ చర్యలు ఎదుర్కొంటున్నారని ఆ ప్రకటన పేర్కొంది. ఈ క్రమంలోనే మంత్రిగా ఉంటూ విచారణను ప్రభావితం చేస్తున్నారు. సెంథిల్ న్యాయ, న్యాయ ప్రక్రియలను అడ్డుకుంటున్నాడు. సెంథిల్ బాలాజీని మంత్రి మండలిలో కొనసాగించడం.. న్యాయమైన విచారణతో సహా న్యాయ ప్రక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే భయాలు ఉన్నాయని, ఇది రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి దారితీస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీని గవర్నర్ మంత్రి మండలి నుంచి తొలగించారు.
ఉద్యోగాల కోసం నగదు కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జూన్ 14న అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తర్వాత జూన్ 15న సెంథిల్ బాలాజీని మద్రాస్ హైకోర్టు(Madras Highcourt) ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. దీనిపై సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. అయితే హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
