కార్తీమమాసంలో(Karthika Masam) శివాలయాల సందర్శన కోసం భక్తులు తహతహలాడతారు. శివదర్శనంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయన్నది భక్తుల నమ్మకం. అందులోనూ జ్యోతిర్లింగాల(Jyothi linga) దర్శనం మరింత పుణ్యదాయకం. కాకపోతే జ్యోతిర్లింగాల దర్శనం కోసం చాలా శ్రమపడాల్సి వస్తుంది. అయితే భక్తుల ఆకాంక్షలను గమనించిన ఇండియన్ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) సరికొత్త టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒకే యాత్రలో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సదుపాయాన్ని కలిగించింది.

కార్తీమమాసంలో(Karthika Masam) శివాలయాల సందర్శన కోసం భక్తులు తహతహలాడతారు. శివదర్శనంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయన్నది భక్తుల నమ్మకం. అందులోనూ జ్యోతిర్లింగాల(Jyothi linga) దర్శనం మరింత పుణ్యదాయకం. కాకపోతే జ్యోతిర్లింగాల దర్శనం కోసం చాలా శ్రమపడాల్సి వస్తుంది. అయితే భక్తుల ఆకాంక్షలను గమనించిన ఇండియన్ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) సరికొత్త టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒకే యాత్రలో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే సదుపాయాన్ని కలిగించింది.

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈ జ్యోతిర్లింగాల యాత్రను నిర్వహిస్తున్నామని ఐఆర్‌సీఈసీ తెలిపింది. ఈ ఏడాది ఈ యాత్ర విజయవాడ(Vijayawada) నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర ద్వారా ఏడు జ్యోతిర్లింగాల దర్శనాలతో పాటు స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని(Statue Of Unity) కూడా చూడొచ్చు. నవంబరు 18 నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది.

ప్రయాణికులు విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం తర్వాత కూడా అయా రైల్వే స్టేషన్లలో దిగే సౌలభ్యం ఉంది. ఈ టూర్‌ మొత్తం పన్నెండు రాత్రులు పదమూడు పగళ్లు కొనసాగుతుంది. టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టూటైర్‌ ఏసీ క్లాసుల్లో టికెట్లు బుకింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన రెండు క్లాసుల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

టికెట్‌ రేట్లు 21 వేల రూపాయల నుంచి మొదలవుతాయి. నవంబర్‌ 18న విజయవాడలో రాత్రి ఎనిమిది గంటలకు రైలు బయలుదేరి ఖమ్మం మీదుగా ప్రయాణం సాగుతుంది. రెండో రోజు తెల్లవారుజామున 2.42 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుంటుంది. మూడో రోజు ఉదయం 5.35 గంటలకు ఉజ్జయిని చేరుకుంటుంది. అక్కడే భక్తులకు అల్పాహారం(Break Fast) అందిస్తారు.

తర్వాత ఉజ్జయిని మహాకాళేశ్వర్‌(Ujjaini Mahakaleswar) ఆలయ దర్శనం చేయిస్తారు. ఆ రోజు రాత్రి అక్కడే బస. నాలుగో రోజు ఉదయం అల్పాహారం చేసుకుని రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఓంకారేశ్వర(Omkareswari) ఆలయాన్ని దర్శించుకుంటారు భక్తులు. సాయంత్రం ఉజ్జయిని రైల్వేస్టేషన్ నుంచి వడోదరకు బయలుదేరుతారు. అయిదో రోజు ఉదయం ఏడున్నరకు వడోదర చేసుకుంటారు.

అక్కడ ముందు బుక్‌ చేసిన హోటల్‌కు IRCTC తీసుకెళుతుంది. అక్కడ పర్యాటకులు కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత స్టాట్యూ ఆఫ్‌ యూనిటీకి దర్శిస్తారు. తర్వాత ద్వారకకు వెళతారు. ఆరో రోజున ద్వారలో ద్వారకాదీశ్‌ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి అక్కడే బస చేసి ఏడో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత బెట్‌ ద్వారకకు వెళతారు. అక్కడే నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని సాయంత్రం ద్వారకకు చేరుకుంటారు.

తర్వాత సోమనాథ్‌ ఆలయానికి బయలుదేరతారు. ఎనిమిదో రోజు సోమనాథ్‌ జ్యోతిర్లింగాలయాన్ని దర్శించుకుని సాయంత్రం సోమనాథ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని మళ్లీ రైలులో నాసిక్‌కు బయలుదేరుతారు. తొమ్మిదో రోజు రాత్రి నాసిక్‌లోనే బస ఉంటుంది. పదో రోజు ఉదయం టిఫిన్‌ చేశాక త్రయంబకేశ్వరున్ని సందర్శించి తిరిగి నాసిక్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌కు వచ్చి పుణెకు పయనమవుతారు.

11వ రోజు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత భీమశంకర్‌ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ఔరంగాబాద్‌కు బయల్దేరుతారు. 12 రోజు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని సికింద్రాబాద్‌కు పయనమవుతారు. 13వ రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌, మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ చేరుకుంటారు. ఉదయం టీ, టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు.

రాత్రి బస బాధ్యత కూడా రైల్వేదే! యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కూడా ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఉండే ప్రవేశ రుసుములు మాత్రం వ్యక్తులే చెల్లించుకోవాలి.ఎకానమీలో అంటే స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణానికి ఒక్కో టికెట్‌ ధర (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) 21 వేల రూపాయలు. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు మాత్రం 19,500 వేల రూపాయలు. స్టాండర్ట్‌లో అంటే థర్డ్‌ ఏసీ ప్రయాణానికి (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) 32,500 రూపాయలు చెల్లించాలి.

ఇక్కడ కూడా 5-11 ఏళ్ల మధ్య చిన్నారులు 31 వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కంఫర్ట్‌లో 2ఏసీ ప్రయాణానికి (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) 42, 500 రూపాయలు చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులు 40,500 రూపాయలు చెల్లిస్తే చాలు. ప్రయాణికులు గమనించాల్సిన విషయం ఏమిటంటే క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం ప్రయాణానికి నాలుగు రోజుల ముందు క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరుగు చెల్లింపులు ఉండవు.

Updated On 13 Nov 2023 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story