చంద్రయాన్-3(Chandrayaan-3) విజయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.

చంద్రయాన్-3(Chandrayaan-3) విజయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుని సౌత్​ పోల్​పై కాలు మోపిన మొదటి దేశంగా అవతరించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది.. ఈ ఘనతకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష వేడుకలు నిర్వహించేందుకు భారత్ నిర్ణయించింది. చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం - ఇండియా స్పేస్ సాగా'(India space saga) అనే థీమ్‌తో ఈ ఏడాది నేషనల్ స్పేస్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.

లాస్టియర్‌ జూలై 14న చంద్రయాన్-3 ని విజయవంతంగా కక్ష్య లోకి ప్రవేశ పెట్టారు. మరుసటి రోజు, మొదటి కక్ష్యను పెంచే విన్యాసాలను విజయవంతంగా ప్రదర్శించారు. ఆగస్టు 1, 2023న, ట్రాన్స్‌ లూనార్ ఇంజెక్షన్ విజయవంతంగా పని చేసింది. ఆగస్టు 5న చంద్రయాన్‌-3 ని చంద్రుడి కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఆగస్ట్ 17, 2023న, ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా వేరైంది. ఆగష్టు 23న, సాయంత్రం 6:04 గంటలకు, చంద్రయాన్-3 ల్యాండర్ ల్యాండింగ్ కోసం లక్ష్యంగా పెట్టుకున్న 4.5 కిలో మీటర్ల విస్తీర్ణం లోని మధ్య భాగాన్ని తాకింది. ఆ పాయింట్‌కి 300 మీటర్ల (985 అడుగులు) దూరంలో ల్యాండర్ ల్యాండ్ అయింది. చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో చంద్రుని సౌత్​ పోల్​పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్​ నిలిచింది. అంతే కాకుండా చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగు పెట్టిన అమెరికా , చైనా(china), రష్యా(Russia) తర్వాత భారత్ నాలుగో దేశంగా అవతరించింది. 600 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో ఈ మిషన్ ప్రారంభమైంది. భారత్ తదుపరి మానవ సహిత చంద్ర యాత్రకు ప్రయత్నిస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్(S.Somanath) తెలిపారు. భారత్ మొదటి మిషన్ చంద్రయాన్-1 అక్టోబర్ 22, 2008న ఆంధ్రప్రదేశ్​ లోని శ్రీహరికోట లోని SDSC SHAR నుంచి విజయవంతంగా ప్రారంభించారు. ఈ మిషన్ నవంబర్ 10న చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ మైలు రాయిని సాధించిన ఐదో దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది. నవంబర్ 14న చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న షాకిల్టన్ క్రేటర్ సమీపంలో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (MIP) ఢీకొనడంతో చంద్రునిపై విజయవంతంగా దిగిన ఐదో దేశంగా భారత్ అవతరించింది. ఈ మిషన్ రెండు సంవత్సరాల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే ఆర్బిటర్‌తో సంబంధాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని 28 ఆగస్టు 2009న ముగించినట్లు అధికారికంగా ప్రకటించారు. చంద్రయాన్-1 మిషన్ విజయవంతం అయిన తర్వాత 2019 జూలై 22న చంద్రయాన్-2ని ప్రయోగించారు. కక్ష్యను పెంచే విన్యాసాలు, చివరకు ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ తర్వాత, చంద్రయాన్-2 ఆగస్టు 20న చంద్రుని కక్ష్య లోకి ప్రవేశించింది. అయితే, సెప్టెంబర్ 6న చంద్రుని ఉపరితలం పైకి దిగుతున్న సమయంలో క్రాష్- ల్యాండింగ్ తర్వాత ల్యాండర్‌తో సంబంధం కోల్పోయింది..

Eha Tv

Eha Tv

Next Story