దేశంలో వచ్చే మూడు నెలలు భరించలేనంత ఎండలు(Summer) ఉండబోతున్నాయి. దానికి తోడు విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ(IMD) విభాగం ప్రకటించింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది.

దేశంలో వచ్చే మూడు నెలలు భరించలేనంత ఎండలు(Summer) ఉండబోతున్నాయి. దానికి తోడు విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ(IMD) విభాగం ప్రకటించింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర(Mrityunjay Mahapatra) పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. అదే సమయంలో మైదాన ప్రాంతంలో వేడి గాలులు(heat waves) వీచే రోజులు పెరిగే అవకాశముందని తెలిపారు సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులు వేడి గాలులు వీచేవని, ఈ సారి పది నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశముందని హెచ్చరించారు. గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు.

Updated On 2 April 2024 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story