ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) లిక్క‌ర్ పాల‌సీ కేసు(Liquore Policy Case)లో రేపు సీబీఐ(CBI) ఎదుట హాజ‌ర‌వాల్సివుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడితే ప్రపంచంలో ఎవరూ నిజాయితీపరులు కాదని అన్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) లిక్క‌ర్ పాల‌సీ కేసు(Liquore Policy Case)లో రేపు సీబీఐ(CBI) ఎదుట హాజ‌ర‌వాల్సివుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడితే ప్రపంచంలో ఎవరూ నిజాయితీపరులు కాదని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquore Policy Scam)లో ఈడీ, సీబీఐలు కోర్టును తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. ఈ రెండు సంస్థలు తప్పుడు సాక్ష్యాలను సమర్పించి కోర్టును తప్పుదోవ పట్టించాయని, ఈ కారణంగానే మనీష్ సిసోడియా(Manish Sisodia) జైలులో ఉన్నారని ఆయన అన్నారు.

14 ఫోన్లను బద్దలు కొట్టి సాక్ష్యాలను నాశనం చేశారని సిసోడియాపై ఆరోపణలు చేశారని కేజ్రీవాల్ అన్నారు. కోర్టులో తప్పుడు వాస్తవాలను ప్రదర్శించడం ద్వారా సిసోడియాను ఇరికించారని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈడీ, పీబీఐ రూ. 100 కోట్ల లంచం ఆరోపించింది. ఎన్నో సార్లు దాడులు చేశారు. కానీ ఏం కనుగొనబడలేదని అన్నారు.

గత 75 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) లాగా ఏ పార్టీని టార్గెట్ చేయలేదని అన్నారు. మంచి విద్యపై ప్రజల్లో ఆశలు పెంచామని, ఈ ఆశకు స్వస్తి పలకాలన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజే ఆ తర్వాతి సంఖ్య నాదేనని తెలిసిందన‌ని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Updated On 16 April 2023 5:07 AM GMT
Yagnik

Yagnik

Next Story