అయోధ్యలో(ayodhya) రామాలయం(Ram Mandhir) ప్రారంభమయ్యింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం మధ్యహ్నం 12: 29 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది.

అయోధ్యలో(ayodhya) రామాలయం(Ram Mandhir) ప్రారంభమయ్యింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం మధ్యహ్నం 12: 29 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహ ప్రాణ ప్రతిష్టపై చాలా మంది ప్రముఖులు సోషల్‌ మీడియాలో(Social media) స్పందించారు. టాలీవుడ్‌ ప్రముఖ హీరో మహేశ్‌బాబు(Mahesh babu) కూడా రియాక్టయ్యారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ' చరిత్ర యొక్క ప్రతిధ్వనులు, విశ్వాసం యొక్క పవిత్రత మధ్య, అయోధ్యలో రామ మందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత, ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది' అని మహేష్ బాబు ట్వీట్‌ చేశాడు.

Updated On 22 Jan 2024 7:12 AM GMT
Ehatv

Ehatv

Next Story